Jio Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొన్ని తక్కువ ధర (బడ్జెట్) రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్గా నిలిపివేసింది. దీంతో తమ నెలవారీ బడ్జెట్ ప్లాన్ ను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియక.. యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ జియో తొలగించిన బడ్జెట్ ప్లాన్లు ఏవి? ఇందుకు కారణం ఏంటి? ఇన్నాళ్లు వాటి వల్ల యూజర్లకు కలిగిన బెనిఫిట్స్ ఏవి? ఈ కథనంలో చూద్దాం.
ఇన్నాళ్లు తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, డేటా అందించిన కొన్ని కీలకమైన ప్లాన్లు ప్రస్తుతం జియో యాప్, వెబ్సైట్లలో కనిపించడం లేదు. ఎంతో పాపులర్ అయిన రూ.209, రూ.249 ప్లాన్ లు అదృశ్యమయ్యాయి. ఇంతకాలం నెలకు సరిపడ డేటా, వ్యాలిడిటీని అందించిన ఈ ప్లాన్లు.. ప్రస్తుతం లేకపోవడం యూజర్లకు నిజంగా ఎదురుదెబ్బేనని టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి.
జియో తొలగించిన రూ.204 ప్లాన్ విషయానికి వస్తే.. ఇది 22 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండేది. ప్రతీ రోజూ కస్టమర్లకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందించేది. అటు రూ.249 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో గతంలో జియో అందుబాటులో ఉంచింది. ఇది కూడా రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేసేది. ప్రస్తుతం ఈ ప్లాన్స్ ను తొలగించి.. వాటి స్థానంలో బేసిక్ ఎంట్రీ లెవల్లో రూ.299 ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. ఇది రోజుకు 1.5 GB డేటా, ఫ్రీకాల్స్, ఎస్ఎంఎస్ లను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.
Also Read: అసలేంటీ ‘స్టార్ రేటింగ్’ కథ? కరెంటు బిల్లుకు దానికి లింకేంటి? తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇన్నాళ్లు చౌకైన ప్లాన్స్ కు పరిమితమైన యూజర్లను అధిక ధర ప్లాన్ల వైపు మళ్లించేందుకు జియో రూ.209, రూ.249 ప్లాన్లను తొలగించినట్లు మార్కెట్లు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తన సగటు రాబడిని పెంచుకునేందుకు ఇలాంటి చౌకైన ప్లాన్లను రద్దు చేసి.. కస్టమర్లను ప్రీమియం ప్లాన్ల వైపునకు మళ్లించాలని జియో చూస్తోందని పేర్కొంటున్నారు. ఫలితంగానే ఒకప్పుడు రూ.249కే నెల రోజుల పాటు 1GB డేటా పొందిన కస్టమర్లు.. ఇప్పుడు రోజుకు 1.5GB డేటా అందించే కనీస రూ.299 ప్లాన్ ను ఎంచుకోక తప్పడం లేదని వివరిస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..