Samsung Price Hike| శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఒక చేదు వార్త. గెలాక్సీ A, F సిరీస్లోని చాలా మోడల్స్ ధరలను కొరియన్ టెక్ కంపెనీ పెంచేసింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 25, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. కొన్ని వేరియంట్లలో ధరలు రూ.2,000 వరకు పెరిగాయి. గెలాక్సీ A56, A36, F17 5G వంటి మోడల్స్ ఈ ధర పెంపునకు గురయ్యాయి. శాంసంగ్ ధర పెంచడానికి అధికారిక కారణం చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ నిపుణులు భారత కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ విడిభాగాల ధరల పెరుగుదల, సప్లై చైన్ ఖర్చులను కారణాలుగా చెబుతున్నారు.
గెలాక్సీ A56 రెండు వేరియంట్ల ధరలు పెరిగాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.44,999 అయింది. ముందు ధర రూ.43,999 ఉండేది. ఇప్పుడు రూ.1,000 పెరిగింది. 12GB RAM + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.48,999 అయింది. ఇంతకుముందు ధర రూ.46,999 ఉండేది. ఈ వేరియంట్ ధర రూ.2,000 పెరిగింది. రెండు స్టోరేజ్ ఆప్షన్లకూ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించాలి.
గెలాక్సీ A36 లైనప్ ధరలు కూడా మారాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ఇప్పుడు రూ.36,499 అయింది. ముందు ధర రూ.35,499 ఉండేది. రూ.1,000 పెరిగింది. 12GB RAM + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.40,499 అయింది. ఇంతకు ముందు ధర రూ.38,499 ఉండేది. ఈ వేరియంట్ ధర కూడా రూ.2,000 పెరిగింది. రెండు వేరియంట్లు ఇప్పుడు ఎక్కువ ధరలో ఉన్నాయి.
Also Read: వైరల్ వీడియో స్కామ్తో కొత్త సైబర్ ఫ్రాడ్.. ఒక్క క్లిక్తో మీ ఫోన్ హ్యాక్..
బడ్జెట్ యూజర్లకు ప్రత్యేకమైన ఫోన్ గెలాక్సీ F17 5G. ఈ మోడల్లో ఎక్కువ వేరియంట్లు ఉన్నాయి. అన్ని ధరలు పెరిగాయి.
4GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ పెరిగిన ధర రూ.16,499. ఇంతకుముందు ధర రూ.15,499 ఉండేది.అంటే రూ.1,000 పెరిగింది.
6GB RAM + 128GB వేరియంట్ పెరిగిన ధర రూ.17,999. అయింది. ఇంతకుముందు ధర రూ.16,999 ఉండేది. రూ.1,000 పెరుగుదల ఉంది.
8GB RAM + 128GB టాప్ వేరియంట్ ఇప్పుడు రూ.19,999 అయింది. ఇంతకుముందు ధర రూ.18,499 ఉండేది. రూ.1,500 పెరిగింది.
ఈ ఫోన్ కొనడానికి బడ్జెట్ యూజర్లు ఇప్పుడు కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి.
ఈ మోడల్స్ అన్నీ మిడ్ రేంజ్లో మంచి ఫీచర్స్ ఇస్తున్నాయి. ఈ ధర పెంపు మిడ్-రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లను ప్రభావితం చేసింది. ఫోన్ అప్గ్రేడ్ చేయాలనుకునేవారికి ఈ ధర పెంపు వల్ల ఇప్పుడు కాస్త ఇబ్బంది తగ్గదు.