E-Paper
Advertisement

వన్ ప్లస్, షావోమీ, రియల్‌మీ.. భారీగా పెరిగిన మెుబైల్స్ ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

వన్ ప్లస్, షావోమీ, రియల్‌మీ.. భారీగా పెరిగిన మెుబైల్స్ ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

Smartphone Price Hike 2026: ఏప్రిల్ 1 తర్వాత మెుదలైన కొత్త ఆర్థిక సంవత్సరం.. మెుబైల్ ప్రియులపై ఆర్థిక భారాన్ని మోపింది. టాప్ కంపెనీలు.. తమ మెుబైల్స్ ధరను అమాంతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే పలు కంపెనీలు.. పెంచిన ధరలతో కొత్త ఎం.ఆర్.పీ ధరలను సైతం విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మెుబైల్ బ్రాండ్స్ అయిన వన్ ప్లస్, రియల్ మీ, షావోమి.. ఏ మోడల్స్ పై ఎంత పెంచిందో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రియల్ మీ స్మార్ట్ ఫోన్స్

ప్రముఖ మెుబైల్ బ్రాండ్ రియల్ మీ.. రూ.10,000 నుంచి రూ.40,000 వరకూ ధర కలిగిన మోడల్స్ ధరలను అమాంతం పెంచింది. దీంతో ఒక్కో మోడల్ పై రూ.1000 నుంచి రూ.3,000 వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Realme సీ71 4జీ, సీ83 5జీ, 15ఎక్స్ 5జీ, 15టీ 5జీ, పీ4 ప్రో 5జీ, 15 5జీ, 16 ప్రో 5జీ మోడల్స్ పై రూ.1000 చొప్పున రేటు పెరిగింది. అలాగే realme P3 Ultra 5G ఫోన్ వేరియంట్ ను బట్టి రూ.2,500-3000 వరకూ పెంచింది.

షావోమి లేదా రెడ్‌మి మెుబైల్స్

చైనాకు చెందిన ఈ టెక్ బ్రాండ్.. తన రెడ్ మీ 15, రెడ్ మీ నోట్ 15 సిరీస్ మోడల్స్ పై రూ.1500 నుంచి రూ.3000 వరకూ ధర పెంచింది. ముఖ్యంగా Redmi 15C 5G మోడల్ ధరపై రూ.1,500 పెరిగింది. లాంచ్ సమయంలో రూ.13,999 గా ఉన్న ఈ ఫోన్ ధర.. ఇప్పుడు రూ.15,499కి చేరింది. అలాగే Redmi Note 15 5G వంటి మోడల్స్ ధరలు కూడా దాదాపు రూ.3,000 వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

వన్ ప్లస్ ఫోన్స్..

వన్ ప్లస్ విషయానికి వస్తే.. రియల్ మీ, రెడ్ మీ స్థాయిలో ఈ సంస్థ ధరలను పెంచలేదు. తన లేటెస్ట్ 15R సిరీస్ పై మాత్రమే ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్ 15ఆర్ (12GB+256GB, 12GB+512GB) వేరియంట్లపై రూ.2,500 చొప్పున వన్ ప్లస్ ధరలను పెంచేసింది. అయితే భవిష్యత్తులో మరిన్ని ఫోన్లను ఈ ధరల పెంపు పరిధిలోకి తీసుకొస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read: రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ధరల పెరుగుదలకు కారణాలేంటి?

ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం.. అంతర్జాతీయంగా సెమీకండక్టర్లు, మెమరీ చిప్‌ల కొరత ఏర్పడింది. దీంతో మెుబైల్స్ తయారీ వ్యయం భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో శాంసంగ్, వివో, ఒప్పో వంటి కంపెనీలు కూడా తమ మోడల్స్‌పై ధరలను పెంచే సూచనలు కనిపిస్తున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×