E-Paper
Advertisement

‘క’ డైరెక్టర్లతో మెగా హీరో .. పోస్టర్ తోనే హైప్ క్రియేట్.. యోధుడిగా సాయి దుర్గ తేజ్…

‘క’ డైరెక్టర్లతో మెగా హీరో .. పోస్టర్ తోనే హైప్ క్రియేట్.. యోధుడిగా సాయి దుర్గ తేజ్…
Advertisement

Sai Durga Tej: మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్న వారిలో సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఒకరు. ఇటీవల విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయి దుర్గ తేజ ఇప్పటివరకు 18 సినిమాలలో నటించారు. తాజాగా ఈయన 19వ సినిమా అని కూడా అధికారకంగా ప్రకటించారు. గత కొంతకాలంగా సాయి దుర్గ తేజ్ కొత్త సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇక నేడు తన 19వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయడమే కాకుండా పోస్టర్ కూడా విడుదల చేశారు.

యుగాలనాటి రహస్యాలు.. ఊహ కందని శక్తి..

సాయి దుర్గతేజ్ తన 19వ సినిమాని ‘క ‘ సినిమా ద్వయం దర్శకులు సుజిత్- సందీప్(Sujeeth -Sandeep) దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాకు షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, విజయదుర్గ ప్రొడక్షన్ బ్యానర్ పై సాయి దుర్గ తేజ్ కూడా నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఇక నేడు ఈ సినిమా అధికారకంగా ప్రకటించారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ.. యుగాలనాటి రహస్యాలు.. ఊహ కందని శక్తి. అత్యంత శక్తివంతమైన ఒక ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

యోధుడిగా సాయి దుర్గ తేజ్..

Advertisement

ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో సాయి దుర్గా తేజ ఒక యోధుడిగా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. హీరో కత్తి పట్టుకుని ఎంతో గాంభీర్యంగా కనిపిస్తుండడంతో ఈ సినిమా గత యుగం కాలంనాటి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం అవుతుంది. ఇలా అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.  అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి సాయి ధరమ్ తేజ్ తన 19వ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

Advertisement

రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ పాన్-ఇండియా సినిమాగా ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu – SYG) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సాయి దుర్గ తేజ్ జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

Also Read: మెగా 158 ముహూర్తం ఖరారు…పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్ ఇవే!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×