E-Paper
Advertisement

Telecom: మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త.. కొత్త నిబంధనలు అప్లై, అసలు మేటరేంటి?

Telecom: మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త.. కొత్త నిబంధనలు అప్లై, అసలు మేటరేంటి?
Advertisement

Telecom: టెలికాం ఆపరేటర్ల మొబైల్‌ ప్రీపెయిడ్‌ చందాదారుల గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని ఎంపీలు నిలదీయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగింది?

మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త

Advertisement

గడిచిన రెండురోజులుగా టెలికాం గురించి విపక్ష సభ్యులు రాజ్యసభలో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ఎంపీలు ప్రస్తావించారు. టెలికాం ఆపరేటర్ల ధరల విధానంలో చాలాకాలంగా ఉన్న ఓ లోపం వెలుగులోకి వచ్చింది. ఇది ముమ్మాటికీ ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకునేలా ప్రొత్సహించింది. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు పలువురు ఎంపీలు.

కావాలనే టెలికాం ఆపరేటర్లకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  దీనిపై కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. మొబైల్ రీఛార్జ్ వినియోగదారులు నెల వారీ రీఛార్జి చేసుకుంటే కేవలం 28 రోజుల కాల పరిమితి ఇచ్చేవి టెలికాం ఆపరేటర్లు. దీన్ని నెల రోజులుగా మార్చాలని టెలికాం సంస్థలకు ఆయన సూచించారు.

Advertisement

కొత్త నిబంధనలు అప్లై, టెలికాం మంత్రి క్లారిటీ

ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్‌, ఈ విషయమై టెలికాం సంస్థలకు స్పష్టత ఇచ్చింది. 30 రోజుల కాలపరిమితి గల ప్రీపెయిడ్‌ పథకాలు అమలు చేయాలని తాము కోరలేదని తెలిపింది. తప్పనిసరిగా 30 రోజుల కాలపరిమితి గల ప్లాన్ ఉండాలని సూచించింది. ప్రతి విభాగంలో 30 రోజుల కాలపరిమితి గల రీఛార్జ్ ప్లాన్ ఉండాలని తేల్చి చెప్పింది.

దీనికి సంబంధించిన సూచనలు 2022లో ట్రాయ్‌ నిర్దేశించినట్లు గుర్తు చేశారు. ప్లాన్‌ ఓచర్లు, స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్లు, కాంబో ఓచర్లు ఇలా రీఛార్జ్ ప్లాన్ చూసినా అందులో కచ్చితంగా 30 రోజులు ఉండాల్సిందేనని సూచించింది. ఏ టెలికాం ఆపరేటర్ ప్రవేశపెట్టే ప్లాన్‌లో తప్పనిసరిగా వన్-టైమ్ ప్లాన్, ఒక కస్టమ్ ప్లాన్, 30-రోజుల ప్లాన్ వంటివి ఈ మూడు కేటగిరీల ప్లాన్‌లు ఉండాలని టాయ్ తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ మొబైల్ వినియోగదారుడు రీఛార్జ్ చేయకపోయినా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అనుమతించాలన్నారు. వినియోగదారుడు రీఛార్జ్ ప్లాన్‌కు మొత్తం చెల్లించినప్పటికీ టెలికాం కంపెనీలు 24 గంటల రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తున్నాయని తెలిపారు.

ALSO READ:  మెదడుతో ల్యాప్‌టాప్ కంట్రోల్ చేసిన యువకుడు.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే

అర్ధరాత్రికి ఉపయోగించని డేటా గడువు ముగుస్తుందని వాదించారు. రోజువారీ డేటా రీఛార్జ్ ప్లాన్‌లో మిగిలిన డేటాను తదుపరి రోజు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. రీఛార్జి చేయకపోతే అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ను ఆపడం సబబే? ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపుతున్నారని సదరు ఎంపీ ప్రశ్నించారు. ఏడాది వరకు ఇన్‌కమింగ్‌కాల్స్‌, మెసేజ్‌లు అందుకునే అవకాశం మొబైల్‌ వినియోగదారులకు కల్పించాలని సూచించారు.

ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం 90 రోజుల పాటు రీఛార్జి చేయకపోతే ఆ కనెక్షన్‌ను డీయాక్టివేట్‌ చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన నేపథ్యంలో రీఛార్జ్ ప్లాన్‌ల చెల్లుబాటు కాలం, ఇన్‌కమింగ్ కాల్స్ అనే రెండు విషయాలను ట్రాయ్ పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×