E-Paper
Advertisement

Kamran Akmal: అభిషేక్ మ‌నిషా? రాక్ష‌సుడా ? వాడిని వ‌దిలితే 500 కూడా కొట్టేస్తాడురా

Kamran Akmal: అభిషేక్ మ‌నిషా? రాక్ష‌సుడా ? వాడిని వ‌దిలితే 500 కూడా కొట్టేస్తాడురా

Kamran Akmal:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం రోజున మూడవ టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). 14 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు… అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై స్పందిస్తున్నారు. అటు పాకిస్తాన్ ( Pakistan) మాజీ క్రికెటర్లు కూడా తెగ పొగిడేస్తున్నారు. తాజాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ) స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆటగాడికి అభిషేక్ శర్మ తయారయ్యాడని వెల్లడించారు. వీడిని ఇలాగే వదిలేస్తే వన్డేల్లో ఒక్కడే 500 పరుగులు కొట్టే ప్రమాదం ఉందని వార్నింగ్ కూడా ఇచ్చాడు క‌మ్రాన్ అక్మ‌ల్.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

అభిషేక్ శర్మను వదిలేస్తే 500 పరుగులు కూడా కొడతాడు

న్యూజిలాండ్ పై 14 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించారు. టీమిండియాకు మరో సచిన్ టెండూల్కర్ లాగా అభిషేక్ శర్మ తయారవుతాడని వెల్లడించారు. ప్రమాదకరంగా ఇప్పుడిప్పుడే మారిపోతున్నాడని అభిషేక్ శర్మపై కామెంట్ చేశారు కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ). ఫ్యూచర్ లో వన్డే క్రికెట్ లో అతడు అడుగుపెడతాడని.. ఆ సమయంలో కచ్చితంగా ఒక్కడే 500 పరుగులు చేయగలుగుతాడని కూడా అంచనా వేశారు. అభిషేక్ శర్మను ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. న్యూజిలాండ్ లాంటి భయంకరమైన బౌలర్లకు చుక్కలు చూపించాడని… ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ ఆడే ప్రతి జట్టు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ). అభిషేక్ శర్మ షాట్స్ ఆడే సెలక్షన్స్ అద్భుతంగా ఉందని.. ఫుల్ కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేస్తాడని వివరించారు. భవిష్యత్తు అభిషేక్ శర్మ అదే అని కొనియాడారు.

పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌

న్యూజిలాండ్ పై టీమిండియా 10 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్‌. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( T20 World Cup 2026 Tournament ) ఆడే పాకిస్తాన్ ఒక్క‌సారి ఆలోచ‌న చేసుకోవాల‌ని సూచ‌న‌లు చేశారు. ఒక‌వేళ తెగించి, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ఆడితే మాత్రం కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ( Chennai) ప‌డ‌తార‌ని హెచ్చ‌రించాడు. ఇక‌నైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ఆడే ముందు పాకిస్తాన్ ఆలోచ‌న చేసుకోవాల‌ని తెలిపారు. ఆడక‌పోతేనే పాకిస్తాన్ బ‌తికి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చుర‌క‌లు అంటించారు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్‌.

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×