Virat Fans : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విరాట్ కోహ్లీ నిన్న టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు తమదైన శైన.న.న.న.న.న.న.న.న.న.న.లిలో కామెంట్స్ చేస్తున్నారు. అసలు విరాట్ కోహ్లీ ఇంత అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏం సాధించాడో ఏమో కానీ.. భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్నంత అభిమానులు మరే ఇతర క్రికెటర్ కి లేరు. అలాగే గతంలో సచిన్ టెండూల్కర్.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వీరిద్దరికే భారత్ లోనే క్రికెట్ అభిమానులు కాస్త ఎక్కువగా ఉంటారు. తాజాగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 50 వేల మంది కోహ్లీలు కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Virat Kohli Net Worth : కోహ్లీ ఆస్తులు ఎన్ని కోట్లు.. రోజు ఏ ఫుడ్ తీసుకుంటాడు
50వేల మంది విరాట్ కోహ్లీలు బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వద్దకు ఎలా వస్తారని.. అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఇది ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో. వాస్తవానికి ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఏఐ తో రకరకాల ఫోటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం విశేషం. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కి గుడ్ చెప్పిన విరాట్.. కేవలం వన్డే మ్యాచ్ ల్లో మాత్రమే కనిపించనున్నాడు. రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత రోజే సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించాడు కోహ్లీ. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామ్ కి వెళ్లారీ స్టార్ కపుల్. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటన తరువాత పాల్గొన్న తొలి వ్యక్తిగత కార్యక్రమం కావడంతో అంతా దీని గురించి చర్చించుకుంటున్నారు.
అసలు ఈ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా అందరికీ అర్థం అయ్యేలా చెబుతుంటారు. ఎలా బతకాలి, ఎలా సమస్యలను అధిగమించాలో వివరిస్తుంటారు. భజనలు, ఉపవాసాలతో ఎంతో మంది భక్తులు ఆయనకు చేరువయ్యారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యల పరిస్కారం కోసం ప్రేమానంద్ ను కలుస్తుంటారు. గత మూడు, నాలుగేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ కోహ్లీ పలుమార్లు ఈ గురువును కలిసినట్టు సమాచారం. టీ-20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే ముందు కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నాడట విరాట్ కోహ్లీ. ప్రధానంగా తన కెరీర్, జీవితంలో ఎదుర్కునే ఇబ్బందులను ఆయనతో పంచుకొని వాటిని పరిష్కరించుకున్నాడు. అందుకే రిటైర్మెంట్ తరువాత కూడ తొలుత ప్రేమానంద్ ను కలిశాడు కోహ్లీ.