E-Paper
Advertisement

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..
Advertisement

WPL: ఉమెన్ ప్రిమియర్ లీగ్. ఇండియాను షేక్ చేసే అవకాశమున్న టోర్నీ. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కావడంతో.. డబ్ల్యూపీఎల్ కూడా ఇరగదీస్తుందని భావిస్తున్నారు. అసలే అమ్మాయిలు.. వారి ఆట చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారని అంచనా వేస్తున్నారు. అందులోనూ, మహిళా క్రికెటర్లలో ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్స్ గా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు.

ముంబైలో జరిగిన WPL వేలంలో ఓ తెలుగు క్రికెటర్ కి మంచి ధర పలికింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి శర్వాణి.. లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ రాణిస్తున్నారు. 30 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరీలో ఉన్న అంజలిని.. ఏకంగా 55 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది యూపీ వారియర్స్.

Advertisement

అంజలి శర్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. ఆ సిరీస్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడింది. ప్రజెంట్ సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ఇండియన్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నారు అంజలి శర్వాణి.

WPL యాక్షన్ లో అంజలికి 55 లక్షలు పలకడంపై ఆమె కుటుంబ సభ్యులు, అదోని వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×