E-Paper
Advertisement

Centuries In CT 2025: చాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ లో సెంచరీ.. సెంచరీలు బాదిన వీరులు వీళ్లే ?

Centuries In CT 2025: చాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ లో సెంచరీ.. సెంచరీలు బాదిన వీరులు వీళ్లే ?
Advertisement

Centuries In CT 2025: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు పూర్తయ్యాయి. భారత్ సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్ కి చేరుకుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ ఫైనల్ ని తలపిస్తుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సెమీఫైనల్స్ రేసులో నిలవడం చాలా కష్టతరం. వరల్డ్ బెస్ట్ 8 టీమ్స్ గ్రూప్ – ఎ, గ్రూప్ – బి గా ఆడుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి.

 

Advertisement

ప్రస్తుతం ఆడే మ్యాచ్ లు అన్నీ సెమిస్ వైపు అడుగులు వేయడానికే. గ్రూప్ – ఏ లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, టీమ్ ఇండియా, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇందులో భారత్ రెండు మ్యాచ్లలో విజయం సాధించి సెమిస్ లో అడుగుపెట్టగా.. పాకిస్తాన్ రెండు మ్యాచ్లలో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. గ్రూప్ – బి లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఆడుతున్నాయి. ఇందులో ప్రతి జట్టు ఒక మ్యాచ్ ఆడింది. గ్రూప్ – బి లో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, నాలుగవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచాయి.

అయితే ఈ టోర్నీలో సెంచరీల వరద పారుతూ ఉండడం విశేషం. ఆటగాళ్లు సిక్సులు, బౌండరీలతో శతకాలు నమోదు చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో నమోదైన సెంచరీల వివరాలు చూస్తే.. ఓపెనింగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ జరగగా.. ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. విల్ యంగ్ 113 బంతులను 107 పరుగులతో సెంచరీ చేయగా, టామ్ లాథమ్ 14 బంతులలో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరగగా.. ఇందులో రెండు సెంచరీలు నమోదయ్యాయి.

Advertisement

బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ 118 బంతులలో శతకం సాధించాడు. ఇక ఇదే మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ గిల్ 101 శతకం సాధించాడు. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ రికెల్టన్ 103 సెంచరీ తో చెలరేగాడు. ఇక నాలుగవ మ్యాచ్ ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరగగా.. ఈ మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక రికార్డు స్కోర్ నమోదయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకేట్ {165} పరుగులతో ఛాంపియన్ స్ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు.

 

అలాగే ఇదే మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ 120 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఆ తర్వాత భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ {100} శతకం సాధించాడు. ఇక సోమవారం బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర 105 బంతులలో 112 పరుగులు చేశాడు. ఇలా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో 9 సెంచరీలు నమోదు కావడం విశేషం. ఈ మెగా టోర్నిలో ఇంకెన్ని సెంచరీలు నమోదు అవుతాయో వేచి చూడాలి.

 

 

View this post on Instagram

 

Related News

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

Big Stories

Advertisement
×