E-Paper
Advertisement

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు
Advertisement

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: పారిస్ ఒలింపిక్స్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇటు ప్రేక్షకులు కూడా ఇంకా ఎప్పుడు అన్న చందంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఈ ఒలింపిక్స్ కోసం రెడీ అయ్యింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు 20 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. బోర్డు తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు రూ. 8.5 కోట్లను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశారు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. మేం ఐవోఏకు రూ. 8.5 కోట్లు అందిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో జై షా పోస్ట్ పెట్టారు.

Tags

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×