BigTV English

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: పారిస్ ఒలింపిక్స్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇటు ప్రేక్షకులు కూడా ఇంకా ఎప్పుడు అన్న చందంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఈ ఒలింపిక్స్ కోసం రెడీ అయ్యింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు 20 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. బోర్డు తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు రూ. 8.5 కోట్లను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశారు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. మేం ఐవోఏకు రూ. 8.5 కోట్లు అందిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో జై షా పోస్ట్ పెట్టారు.


Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×