Shahid Afridi: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో T20 World Cup 2026 tournament) భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఏకంగా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అసలు ఇండియాకు పోటీ కూడా ఇవ్వలేదు పాకిస్తాన్ ( Pakistan). దీంతో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశం మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ లిస్టులోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) కూడా చేరిపోయారు. ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును ఉరి తీసినా తప్పులేదని నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ ఓటమికి సీనియర్ క్రికెటర్లే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటగా బాబర్ ఆజాం ( babar Azam), షాబాద్ ఖాన్ ( Shadab Khan ), తన అల్లుడు షాహీన్ అఫ్రిదిలను ( Shaheen Afridi ) వెంటనే పాకిస్తాన్ జట్టులోంచి తొలగించాలని.. వాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi). దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్కర్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. ఇండియా చేతిలో ఏకంగా 61 పరుగులు తేడాతో కొలంబో వేదికగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) నిప్పులు చెరిగారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో మొదటి నుంచి పాకిస్తాన్ చెత్తగా ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఇండియా చేతిలో ఓడిపోవడం మరీ దారుణమని మండిపడ్డారు షాహిద్ ఆఫ్రీది. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు చెత్త ప్రదర్శన కనబరచడంతో ఈ పరిస్థితి నెలకొంది అన్నారు. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం ( babar Azam), షాబాద్ ఖాన్ ( Shadab Khan ), తన అల్లుడు షాహీన్ అఫ్రిదిలను ( Shaheen Afridi ) ముందుగా పాకిస్తాన్ జట్టులోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కీలకమైన ఇండియా మ్యాచ్ లో ఈ ముగ్గురు ప్లేయర్లు ఎప్పుడూ కూడా రాణించడం లేదు.. అష్ట దరిద్రంగా ఆడుతున్నారని మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమీబియాతో జరిగే మ్యాచ్ లో అయినా కొత్త కుర్రాలకు అలాగే జూనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ముగ్గురు క్రికెటర్లను మళ్లీ ఆడిస్తే పాకిస్తాన్ ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు షాహిద్ ఆఫ్రీది. ఇది ఇలా ఉండగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో పాకిస్తాన్, ఈ నెల 18వ తేదీన నమీబియాతో ఆడనుంది. అందులో పాకిస్తాన్ గెలిస్తేనే టోర్నమెంట్ లో ఉంటుంది. లేకపోతే యూఎస్ఏ సూపర్ 8 లోకి దూసుకెళ్లనుంది.
Also Read: IND VS PAK: శివరాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓటమి, సూపర్ 8లోకి టీమిండియా
టీ20 ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమిపై ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది నిప్పులు చెరిగారు. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, తన అల్లుడు షాహీన్ అఫ్రీదిలను జట్టు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. "కీలక మ్యాచ్ల్లో వీరు ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నారు. నమీబియాతో… pic.twitter.com/HtCIDlVcV2
— ChotaNews App (@ChotaNewsApp) February 16, 2026