Kaveti Manohar: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం జరిగిన కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత ఆయనకు పార్టీ కండువా కప్పి అధికారికంగా జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ కుమార్ సతీమణి కావేటి సబితతో పాటు అనుచరులు, స్థానిక నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. సభ వాతావరణం ఉత్సాహభరితంగా కొనసాగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా సామాజిక తెలంగాణ నిర్మాణం, సామాజిక న్యాయం సాధన లక్ష్యాలతో కృషి చేస్తున్న కల్వకుంట్ల కవిత గారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందాలంటే కవిత నాయకత్వం అవసరమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తూ.. నూతన రాజకీయ పంథాను అవలంబిస్తున్న నాయకురాలిగా కవితకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని మనోహర్ కుమార్ పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ జాగృతి వేదికగా పనిచేస్తోందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ జాగృతిని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని మనోహర్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం సాధనలో ముందుండి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ చేరికతో జాగృతికి మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
ఆయనతో పాటు జాగృతిలో చేరిన ఆయన సతీమణి కావేటి సబిత
కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
Former MLA Kaveti Sammayya's son Manohar joins Telangana Jagruthi. Along with him, his… pic.twitter.com/EaG68LmEse
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2026