Shahid Afridi : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే షాహిద్ అప్రిది గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది మరణించాడని.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రధానంగా అఫ్రిదినీ కరాచీలో హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టినట్టు అందులో పేర్కొన్నారు. అయితే కొన్ని వీడియోలు ఫేక్ వి కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది తన క్రికెట్ మ్యాచ్ ల్లో భారత్ పై పాకిస్తాన్ పోరాటాన్ని హైలెట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు.
Also Read : CSK – MI Fans: ఒరేయ్ మీకు ఒక్కటే… మాకు 5+5 మొత్తం 10.. RCB పరువు తీశారుగా
ముఖ్యంగా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది మరణించారు. దీంతో భారత్ ఈ దాడికి ప్రతిదాడిగా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన వెంటనే అఫ్రిది భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. పాకిస్తాన్ పై దాడి చేసేందుకు భారత్ కి ఎలాంటి ఆధారాలు లేవని.. పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్ పై దాడి చేయలేదని పేర్కొన్నారు. దీని తరువాత చాలా మంది భారతీయులు అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అఫ్రిది మృతి చెందాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. అసలు ఆ వీడియో ని ఎవ్వరూ క్రియేట్ చేశారో ఏమో తెలియదు.. కానీ ఈ వార్త విన్న ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశ్యర్యపోవడం విశేషం.
తొలుత ఆ వీడియో ని చూసిన వారంతా నిజమేనని నమ్మారు. ఇక ఆ తరువాత నిజనిర్దారణ తరువాత ఈ వీడియో AI ద్వారా క్రియేట్ చేయబడిందని తెలిసింది. ఈ వీడియో గురించి ఆధారం మాత్రం ఏమి లేదు. అఫ్రిది బ్రతికి ఉండటంతో అతని పై ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తారా..? అని పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాహిద్ అఫ్రిది మరణించాడనే వార్తలు అవాస్తవమని తేలింది. క్రికెట్ కి రిటైర్మెంట్ అయినప్పటికీ షాహిద్ అఫ్రిది భారత క్రికెటర్ల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. భారత్ ని ఈ మధ్య నిరంతరం ఎగతాళి చేస్తుండటం విశేషం. అఫ్రిది మరణించాడని ప్రకటన రాగానే ఇది వాస్తవం అని చాలా మంది నమ్మారు. ఆ తరువాత అది ఫేక్ వీడియో అని తెలియగానే ఆశ్యర్యానికి గురి కావడం విశేషం. మరోవైపు ఇటీవల ప్రపంచంలోనే పాకిస్తాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ కామెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా భారత్ ను తమతో సమానమని.. తమ ప్రత్యర్థి అని భావించడం పాకిస్తాన్ కి అవమానకరం అంటూ బీరాలు పలకాడు అఫ్రిది. ముఖ్యంగా పాక్ క్రికెటర్ అఫ్రిదికి జరిగిన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని పలువురు కోరుకుంటున్నారు.