E-Paper
Advertisement

CSK – MI Fans: ఒరేయ్ మీకు ఒక్కటే… మాకు 5+5 మొత్తం 10.. RCB పరువు తీశారుగా

CSK – MI Fans: ఒరేయ్ మీకు ఒక్కటే… మాకు 5+5 మొత్తం 10.. RCB పరువు తీశారుగా
Advertisement

CSK – MI Fans : ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఎప్పుడైతే టైటిల్ సాధించిందో అప్పటి నుంచి ఆర్సీబీ పై ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్.. మరోవైపు ముంబై ఇండియన్స్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ పై ఫైనల్ లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ వాళ్లు ట్రోలింగ్స్ చేయాలి కానీ.. ముంబై, చెన్నై వాళ్లు ఎందుకు చేస్తున్నారని కొందరూ క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ కి ఉన్నక్రేజ్ వేరు. అయితే ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు పోటా పోటీ ఉంటుంది. అందుకే ఆర్సీబీ పై చెన్నై, ముంబై ఇండియన్స్ అభిమానులు ట్రోలింగ్స్ చేస్తారు.

Also Read : Rinku Singh Engagement: ఎంపీతోనే రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. కట్నం ఎంతంటే ?

Advertisement

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ట్రోఫీ గెలుచుకుంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ సాధించాయి. దీంతో ఆర్సీబీ పరువు తీశారు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అభిమానులు. ముఖ్యంగా ఒరేయ్ మీకు ఒక్క టైటిల్ వస్తేనే ఆగడం లేదు.. మాకు 5+5 మొత్తం 10 టైటిల్స్ వచ్చాయి. కాస్త అణిగి మణిగి ఉండండిరా బాబు అని ఆర్సీబీ పై అభిమానులు ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరోవైపు ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆ ఫ్లెక్సీలో ఉన్న రోహిత్ శర్మ, ధోనీ ఫోటోలకు బొట్టు పెట్టి దండలు వేసి అరచేతిలో దీపం ముట్టించుకొని దేవుళ్లకు తిప్పినట్టు తిప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండు జట్ల అభిమానులు డ్యాన్స్ లు వేస్తూ సందడి చేస్తున్నారు.

ఐపీఎల్ ప్రారంభమైన 18 సంవత్సరాల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. అయితే మీరు ఎన్ని టైటిల్స్ సాధించినా.. మేము ఒక్క టైటిల్ సాధిస్తేనే ఆ క్రేజే వేరు అన్నట్టుగా అభిమానులు పేర్కొంటున్నారు.  ఎంత క్రేజీ ఉన్నప్పటికీ ఆర్సీబీ వల్ల మరే జట్టు కూడా ఘనంగా సంబురాలు జరుపుకోకుండా అయింది. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సంబురాలు జరుపుకుంటే.. ఆ సంబురాల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఇప్పటివరకు 18 సీజన్లలో ఏ ఒక్క సీజన్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఒక్కసారి టైటిల్ గెలవగానే అభిమానులు అలా చేయడం ఏంటి..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తమకు నచ్చిన క్రికెటర్ల పై అభిమానం ఉండాలి కానీ మరీ కొంత మందికి చావుకి కారణమయ్యేంత ఉండకూడదు అని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ లండన్ కి వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీ జట్టుకి 18 సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. 18వ సీజన్ లో టైటిల్ సాధించింది ఆర్సీబీ.  విరాట్ కోహ్లీ కారణంగా తొక్కిసలాట జరిగిందని కోహ్లీ పై కేసు కూడా నమోదు  కావడం గమనార్హం. 

Tags

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×