GT Retention 2026 : సాధారణంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను అన్ని ఫ్రాంచైజీలు ప్రకటించాయి. డిసెంబర్ 15న మిని వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లను పరిశీలించినట్టయితే విడుదల చేసిన ఆటగాళ్లలో కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, గెరాల్డ్ కోయెట్టి, దాసున్ షనక, మహిపాల్ లోమ్రోర్, షెర్పెన్ రూతర్ పోర్డ్ విడుదల చేసింది గుజరాత్ టైటాన్స్.
Also Read : KKR: KKR రిలీజ్ చేసే ప్లేయర్లు వీళ్ళే… SRH లోకి వెంకటేష్ అయ్యర్?
అలాఏ రిటైన్ చేసుకున్న వారిలో శుబ్ మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, అర్షద్బి షర్నర్, జయంత్ కె, సరూర్ ఖాన్, సూర్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లను గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. తమ తొలి సంవత్సరాల్లో చూపిన స్థిరత్వాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు, ఐపీఎల్ 2026 కోసం తమ స్క్వాడ్ను అధికారికంగా ప్రకటించింది. రిటెన్షన్ విండో ముగియడంతో, GT తమ కీలకమైన ఆటగాళ్లను నిలబెట్టుకుని, మిగిలిన జట్టులో కొన్ని మార్పులు చేసింది.
ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఇద్దరు ప్లేయర్లను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుంది. అది కూడా క్యాష్ రూపంలో సదరు జట్టుకు డబ్బును చెల్లించి సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ను ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే మరో ప్లేయర్ను కూడా సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న విండీస్ పవర్ హిట్టర్ రూథర్ ఫర్డ్ను రూ. 2.6 కోట్లకు ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుంది.2019 నుంచి రూథర్ ఫోర్డ్ ఐపీఎల్ ఆడుతున్నాడు. 2020లో ముంబై తరఫున ఉన్నాడు. అయితే ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ దొరకలేదు. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున మెరిశాడు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ వదులుకోవడానికి సిద్ధం కాగా.. ముంబై ఇండియన్స్ అతడిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్కు ఫినిషర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read : CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్
గుజరాత్ టైటాన్స్ తమ ప్రధాన ఆటగాళ్లను నిలబెట్టుకోవడం ద్వారా స్థిరమైన కోర్ను కలిగి ఉంది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్తో మినీ-వేలంలో తమ స్క్వాడ్కు అవసరమైన కొన్ని కీలక పాత్రల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తోంది.