IPL 2026 Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో తొలిసారిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. 18 సంవత్సరాల తర్వాత తొలిసారి టైటిల్ గెలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ). అయితే.. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium in Bengaluru ) దగ్గర పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ నేపథ్యంలో దాదాపు 11 మంది… మృతి చెందడం జరిగింది. మరో 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
RCB పై 3 సంవత్సరాల బ్యాన్ ?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 11 మంది మరణించడం… బెంగళూరు జట్టుకు శాపంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్… సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై ఏకంగా మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. 11 మంది మరణించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. చేసిన తప్పంతా బెంగళూరు యాజమాన్యంపై నెట్టివేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. దీంతో బీసీసీఐ పాలకమండలి కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ బెంగళూరు పై చర్యలు తీసుకుంటే కచ్చితంగా మూడు సంవత్సరాల బ్యాన్ విధిస్తారట.
మళ్లీ తెరపైకి డెక్కన్ చార్జర్స్ ( Deccan Charges)?
బెంగళూరు జట్టుపై మూడు సంవత్సరాల పాటు దాని విధిస్తే కొత్త జట్టు వచ్చే ఏడాది తెరపైకి రావాలి. కొత్తగా జట్టు ఏర్పాటు చేసే ఛాన్సులు లేవని.. గతంలో నడిచిన డెక్కన్ చార్జర్స్ జట్టును మళ్ళీ తీసుకురావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అనుకుంటున్నారట…. ఆ జట్టును ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. దాదాపు 1600 కోట్లు పెట్టి మరి ఆ జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది.
డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ( Rohit Sharma) ?
ఒకవేళ వచ్చే సీజన్ లో డెక్కన్ చార్జర్స్ రంగంలోకి దిగితే… ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ తగిలి అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డెక్కన్ చార్జర్స్ జట్టుకు గతంలో రోహిత్ శర్మ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ జట్టు తెరపైకి వస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని అంటున్నారు. దీంతో రోహిత్ శర్మ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కచ్చితంగా బెంగళూరు పై బ్యాన్ విధించాలని… వెంటనే డెక్కన్ చార్జర్స్ జట్టును తీసుకురావాలని కోరుతున్నారు.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
— Gems of Cricket (@GemsOfCrickets) June 9, 2025