Australian Players to Miss IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఊహించని ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ కు దాదాపు సగానికి పైగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు దూరమయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపరీతమైన వర్కు లోడు కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు… ఐపీఎల్ ఆడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందట. ఈ క్రమంలోనే పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, మిచెల్ స్టార్క్, జోస్ హెజిల్ వుడ్ లాంటి భయంకరమైన ప్లేయర్లు ఐపీఎల్ ఆడకపోవచ్చు అని చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ లో మెగా వేలం నిర్వహించి… వచ్చే సంవత్సరం మార్చి పదవ తేదీ లేదా 15వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ షురూ చేయాలన్న కసితో ముందుకు వెళ్తోంది బీసీసీఐ. ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ను వచ్చే సీజన్ ఆడడం కష్టమేనని, నివేదికలు రావడంతో.. బిసిసిఐ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్, యాషెస్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ( BGT) ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా పెద్ద టోర్నమెంట్లు ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారయింది. ఐసీసీ టోర్నమెంట్స్ లో గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అవుతోంది. ఐపీఎల్ ఆడటం వల్ల ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే 2027 ఐపీఎల్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆడించకూడదని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు బీసీసీఐకి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ 2027 ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు తగిన బుద్ధి చెప్పేందుకు బీసీసీఐ కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 2027 ఆడక పోతే ఆస్ట్రేలియా క్రికెటర్ల పై దాదాపు రెండు సంవత్సరాల నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడకపోతే , ఐపీఎల్ 2027 టోర్నమెంట్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. కీలక ప్లేయర్లు దూరమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తి కూడా తగ్గుతుంది. దాదాపుగా వాళ్లు ఆడేలా బీసీసీఐ చర్చలు జరుపనుందని కూడా అంటున్నారు. ఒకవేళ వినకపోతే వాళ్లపై రెండేళ్ల బ్యాన్ మంత్రం విధించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.