SHREYAS IYER GOT ANGRY ON SPECTATOR: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మొన్నటి వరకు మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్ వైట్ వాష్ అయింది. అయితే, టీమ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీ వేదికగా చిట్టచివరి మ్యాచ్ మొన్న జరిగింది. ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ.. అసభ్య సైగలు కూడా చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ టి20 జరిగిన సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత, ఏమైందో తెలియదు కానీ.. అభిమానుల గ్యాలరీ వైపు చూసి బెదిరింపులకు దిగాడు. అక్కడితో ఆగకుండా, అభిమానులను ఉద్దేశించి అసభ్య సైగలు చేశాడు. తన చేతులతో… సైగలు చేస్తూ అమ్మనా బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిరీస్ గెలవగానే శ్రేయస్ అయ్యర్ కు ఒళ్లంతా పొగరు ఎక్కిందని.. అందుకే ఇలా మీది రౌడీల బిహేవ్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.
కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్… ఇలా చిల్లరగా వ్యవహరించకూడదని కౌంటర్లు పేల్చుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారని భారత క్రికెట్ నియంత్రణ మండలిని నిలదీస్తున్నారు. అయితే మరి కొంత మంది శ్రేయస్ అయ్యర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఓ అభిమాని… శ్రేయస్ అయ్యర్ తో పాటు టీమ్ ఇండియా సభ్యులను గ్యాలరీ నుంచి తిట్టినాడని పేర్కొంటున్నారు. అందుకే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అలా రియాక్ట్ అయ్యారని స్పష్టం చేస్తున్నారు.
ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గొప్ప మనసు చాటుకున్నాడు. ట్రోఫీ అందుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా ఆహ్వానించాడు. తమ సెలబ్రేషన్స్ లో అతడిని పాల్గొనాలని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే అసహ్యించుకునే శ్రేయస్ అయ్యర్, ఎందుకు ఆ జట్టుకు సంబంధించిన కెప్టెన్ ను ఆహ్వానిస్తాడని వీడియో చూసిన వాళ్లు ప్రశ్నిస్తున్నారు. స్టేడియం లోని ఓ అభిమాని, శ్రేయస్ అయ్యర్ ను గెలికాడని.. అందుకే వీధి రౌడీలా రెచ్చిపోయి ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. అంతేగాని ఆఫ్ఘనిస్తాన్ అంటే శ్రేయస్ కు ఎలాంటి ద్వేషం లేదని పేర్కొంటున్నారు.
SHREYAS IYER GOT ANGRY ON SPECTATOR 🚨
In yesterday's match between India vs Afghanistan in Delhi . Some spectators were abusing and trolling Shreyas.
Shreyas Iyer got triggered and he lost his calm and showed him some gesture ✊🤜
Look at Shivam Dube reaction he was shocked… pic.twitter.com/bOvZOL9egv
— Jeet (@JeetN25) September 18, 2026