Akash chopra On Mohammed Shami, Bhuvneshwar Kumar: మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నాన కష్టాలు పడుతున్నారు. దేశవాళితోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుత ఫిట్నెస్, ప్రదర్శన ఆధారంగా కచ్చితంగా టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ తో పాటు మహమ్మద్ షమీని తీసుకోవాల్సిందే. కానీ ఈ ఇద్దరి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అద్భుతంగా రాణించినప్పటికీ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం లేదని క్రికెట్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య త్వరలోనే వన్డే సిరీస్ జరగనుంది. ఈ నెలాఖరులోనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన వాళ్ళు 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో భువనేశ్వర్ కుమార్ తో పాటు మహమ్మద్ షమీని పక్కకు పెట్టి… మరోసారి బీసీసీఐ షాక్ ఇచ్చింది. దీంతో ఈ ఇద్దరి కెరీర్ ఫినిష్ అయినట్లేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దానికి తగ్గట్టుగానే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ గురించి మర్చిపోయి… రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చే సమయం ఆసన్నమైందని.. దానికి తగ్గట్టుగానే బీసీసీఐ కూడా హింట్ ఇచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఆకాష్ చోప్రా. మీరు పక్కకు వెళ్తే.. కుర్రాళ్లకు అవకాశాలు వస్తాయని కూడా తెలిపారు. దేశవాళితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఎంత ఆడినా కూడా, BCCI ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేయబోదని కుండబద్దలు పుట్టి చెప్పారు. టీమిండియా జట్టులో రియంట్రీ పై ఆశలు వదులుకొని… మీ దారి మీరు చూసుకుంటే బెటర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మహమ్మద్ షమీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. దేశవాళీ, రంజీలు, ఐపీఎల్ ఇలా ఏ ప్లాట్ఫారం దొరికినా రాణిస్తూ సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు షమీని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. అయితే భువనేశ్వర్ కుమార్ మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియాలో అవకాశం వస్తే వెళ్తాను అంటూనే… వాళ్లు పిలవకపోతే హ్యాపీగా ఫీల్ అవుతానని ఇప్పటికే ప్రకటించాడు. టీమిండియా తరఫున ఆడే ఉద్దేశం తనకు లేదన్నట్లుగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భువనేశ్వర్ కుమార్.