Shahid Afridi Reaction On IND VS AFG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్నటి వరకు జరిగిన టీ20 సిరీస్ ముగిసింది. చాలా విజయవంతంగా సాగిన ఈ టి20 సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణించి టైటిల్ గెల్చుకుంది. ఆఫ్గనిస్తాన్ పై వరుసగా మూడు టి20 లు గెలిచిన టీమిండియా, 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మూడవ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. టైటిల్ అందుకునే క్రమంలో… ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా ఆహ్వానించాడు శ్రేయస్ అయ్యర్. అనంతరం శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జర్దాన్ ఇద్దరూ కలిసి, ట్రోఫీని అందుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ ను అందరూ మెచ్చుకుంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే, టీమిండియా సెలబ్రేషన్స్ లో ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ పాల్గొనడంపై పాక్ మాజీలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన సంస్కృతి అంటూ సీరియస్ అవుతున్నారు. ఇక తాజాగా షాహిద్ అఫ్రిది కూడా ఇదే అంశంపై స్పందిస్తూ, పెదవి విరిచాడు.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్నటితో టి20 సిరీస్ ముగిసింది. ఈ క్రమంలో ట్రోఫీ అందుకునే సమయంలో ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాల్గొన్నారు. శ్రేయస్ అయ్యర్ పిలుపు మేరకు ఇబ్రహీం రావడం జరిగింది. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సీరియస్ అయ్యారు. టీమిండియా ప్లేయర్లతో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిగ్గుగా లేదా అంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ పిలవగానే.. ఎలా వెళ్ళావని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కడిగి పారేశారు. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చేతకాదు కానీ… ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లతో సెలబ్రేషన్స్ చేసుకుంటారా ? అసలు బిసిసిఐ పెద్దలకు దిమాక్ ఉందా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షాహిద్ అఫ్రిది.
అంతర్జాతీయ వేదికలలో పాకిస్తాన్ తో మ్యాచ్ లు జరిగినప్పుడు.. టీమ్ ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది అంటూ ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఇచ్చిన ప్రాధాన్యత.. తమకు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెంటనే స్పందించాలని… టీమిండియా పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో టీమిండియాతో పాటు ఆఫ్గనిస్తాన్ పై బ్యాన్ విధించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మీలాంటి ఉగ్రవాదులతో చేతులు ఎలా కలుపుతామని చురకలు అంటించారు. చేతులు కలిపితే, ఇండియాలో క్రికెటర్లను రాళ్లతో కొట్టి చంపేస్తారని స్పష్టం చేస్తున్నారు.