Shoaib Akhtar: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026 ) నేపథ్యంలో వైభవ్ ( Vaibhav Suryavanshi) మెరిశాడు. గ్రూప్ స్టేజ్ లో విఫలమైన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్… ఫైనల్స్ లో మాత్రం ఇరగదీశాడు. మొన్న శ్రీలంక క్రికెటర్లతో గొడవపడ్డ వైభవ్… ఇవాళ మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాడు. 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే వైభవ్ సూర్య వంశీ పై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు దొరికిన ఆణిముత్యం వైభవ్ అంటూ కామెంట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ ఎనిమిదవ వండర్ అంటూ ప్రశంసించారు. వైభవ్ దెబ్బకు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ లాంటివాళ్లను మర్చిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. దీంతో వైభవం పై షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రై సిరీస్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) భాగంగా ఇవాళ దంబుల్లా (Rangiri Dambulla International Stadium, Dambulla) వేదికగా శ్రీలంక వర్సెస్ టీమిండియా లిస్టు A (Sri Lanka A vs India A, Final) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ దుమ్ములేపే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు దొరికిన 8వ వండర్ అంటూ వ్యాఖ్యానించారు. శ్రీలంక లిస్ట్ పైన వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడని వెల్లడించారు.
తాను సచిన్ టెండుల్కర్ ను ( Sachin) చూశాను.. విరాట్ కోహ్లీ ( Virat Kohli) బ్యాటింగ్ కూడా తిలకించాను… కానీ ఇలాంటి వైభవ్ బ్యాటింగ్ ను తాను ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే శక్తి సామర్థ్యాలు అతని సొంతమని ప్రశంసించారు. మొదటి 5 ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే దమ్ము ధైర్యం కేవలం వైభవ్ కు మాత్రమే ఉందన్నారు. అతి త్వరలోనే ప్రపంచ స్థాయి ఆటగాడిగా వైభవ్ ఎదుగుతాడని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అతని రికార్డులు చరిత్రలో నిలిచిపోవడం గ్యారంటీ అన్నారు. మొన్న శ్రీలంక ప్లేయర్లు గెలిచినందుకే.. ఇవాళ ప్రతీకారం తీర్చుకున్నాడని కూడా గుర్తు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.