Irfan Pathan Blames MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఎన్నో విజయాలను జట్టుకు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిన ఏకైక మొనగాడు ధోనీనే. అదే సమయంలో టీమిండియా తలరాత మార్చి… బలమైన జట్టుగా మార్చాడు. కుర్ర క్రికెటర్లకు మాత్రమే జట్టులో అవకాశం ఉంటుందని.. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లను కూడా బయటకు పంపించేశాడు. రిటైర్మెంట్ ఇచ్చేవరకు టీమిండియాను ఓ రేంజ్ కు తీసుకువెళ్లిన మహేంద్ర సింగ్ ధోని… అదే సమయంలో విమర్శల పాలు కూడా అయ్యాడు. గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ తండ్రి లాంటి వాళ్ళు నిత్యం ధోనిని విమర్శిస్తూనే ఉన్నారు.
టీమిండియాను వరల్డ్ నెంబర్వన్ జట్టుగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనిపై మరోసారి మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విరుచుకుపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోని పెద్ద రాక్షసుడు అని… తన కెరీర్ నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటి కోచ్ గారీ క్రిస్టెన్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇద్దరూ కలిసి తనను జట్టు నుంచి గెంటేసారని సంచలన ఆరోపణలు చేశారు. మంచి ప్రదర్శన కనబరిచిన కూడా తనకు జట్టులో అవకాశం ఇవ్వలేదని 2009 సంవత్సరంలో జరిగిన సంఘటనలను గురించి బయటపెట్టారు ఇర్ఫాన్ పఠాన్.
2009 న్యూజిలాండ్ పర్యటనలోనే నన్ను తొక్కేశారు
2009 సంవత్సరంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరిగింది. అప్పటికే శ్రీలంకతో జరిగిన సిరీస్ లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ పర్యటనకు అతడు సెలెక్ట్ అయ్యాడు. అయితే ఈ టోర్నమెంట్ లో ఒక్కసారి కూడా ప్లేయింగ్ 11లో ఇర్ఫాన్ పఠాన్ కు అవకాశం ఇవ్వలేదు మహేంద్రసింగ్ ధోని. న్యూజిలాండ్ పై సిరీస్ గెలిచినప్పటికీ, ఐదో వన్డేలో ధోని తనను కావాలనే ఆడించలేదని ఫైర్ అయ్యారు ఇర్ఫాన్ పఠాన్. సిరీస్ గెలిచిన తర్వాత రిజర్వ్ బెంచ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. కానీ ఆ సాంప్రదాయాన్ని మహేంద్ర సింగ్ ధోని పాటించలేదని మండిపడ్డారు.
దీనిపై అప్పటి కోచ్ గారీ క్రిస్టెన్ ను కూడా నిలదీశానని ఫైర్ అయ్యారు. అతని దగ్గరికి వెళ్తే, తన చేతిలో ఏమీ లేదని కోచ్ గారీ క్రిస్టెన్ చేతులు దులుపుకున్నాడని నిప్పులు చెరిగారు. మొత్తం ధోనీనే చేశాడని, సెలక్షన్ మొత్తం అతడే చూసుకుంటాడని వివరించారు. ధోని చెప్పిన జట్టే ఫైనల్ అంటూ గారీ క్రిస్టెన్ ఆన్సర్ ఇచ్చాడని ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యారు. ఇలా తన కెరీర్ గారీ క్రిస్టెన్, ధోని నాశనం చేశారని ఆరోపణలు చేశారు. అయితే, ఇటీవల దీనిపై మునాఫ్ పటేల్ కూడా రియాక్ట్ అయ్యారు. రిటైర్మెంట్ అయ్యాక, ధోనిని కావాలనే పఠాన్ లాంటి టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.