Aakash Chopra on MS Dhoni: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న వన్డే సిరీస్ ( India tour of England, 2026 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో నిన్న తొలి మ్యాచ్ ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ ( Edgbaston, Birmingham) వేదికగా జరిగింది. అయితే ఈ తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రత్యేక గెస్ట్ గా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా ధోని రాగానే అభిమానులందరూ సంబరాలు చేసుకున్నారు. టీవీల్లో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. మొన్న టి20 సందర్భంగా వచ్చిన మహేంద్ర సింగ్ ధోని… వన్డేల్లోనూ కనిపించడం ఫ్యాన్స్ గుండెల్లో నూతన ఉత్సాహం తెప్పించింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ ( Edgbaston, Birmingham) వేదికగా మొదటి వన్డే జరగగా.. ధోని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ధోనీపై దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. ఓ బుడ్డోడి పక్కన కూర్చున్న మహేంద్ర సింగ్ ధోని… వాడు తినే చిప్స్ తీసుకొని తినేసాడు. ధోని కనిపించగానే… ఆ కుర్రాడు కూడా చిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే దీనిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని కి కొంచెం కూడా బుద్ధి లేదని… ఓ కుర్రాడి దగ్గర చిప్స్ దొంగలించడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గౌతమ్ గంభీర్ క్రెడిట్ దొంగిలించిన ధోని.. ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ కూడా కాజేసాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. వాస్తవంగా ఆకాష్ చోప్రా ఈ కామెంట్స్ చేశాడో లేదో కానీ… సోషల్ మీడియాలో మాత్రం ధోని వీడియోను వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లకు మహేంద్ర సింగ్ ధోని తరచూ హాజరవుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పదవి ఊస్ట్ కావడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్ గా లేదా హెడ్ కోచ్ గా వాడుకునేందుకుగాను బీసీసీఐ రంగం సిద్ధం చేసిందట. అందుకే ధోని ప్రతి మ్యాచ్ కు హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
🚨Aakash Chopra on MS Dhoni🚨
How can a person be so utterly shameless that he snatches chips from a kid?!
This disgraceful man has already stolen credit from legends like Gautam Gambhir.
Enough is enough — he must stop now! pic.twitter.com/49kwbe29y8
— Unknown (@iUnknownVillain) July 15, 2026