Ms Dhoni – Gambhir: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ ( India tour of England, 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ షురూ అయింది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో నిన్న ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ ( Edgbaston, Birmingham ) వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ అన్ని రంగాల్లోనూ టీమిండియా ఆదరగొట్టి… ఇరగదీసింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు టి20 లు జరగగా.. ఇప్పుడు వన్డేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఆడుతున్న ప్రతి మ్యాచ్ చూసేందుకు మహేంద్రసింగ్ ధోని వెళ్తున్నారు. దీంతో గౌతమ్ గంభీర్ (Gambhir) పదవికి బీసీసీఐ చెక్ పెట్టిందని… అందుకే మహేంద్ర సింగ్ ధోనీని (MS Dhoni) రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణమైనా మహేంద్ర సింగ్ ధోని టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరు అందుకుంది.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రతి మ్యాచ్ కు వెళ్లి.. తిలకిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు… చాలా ఓపికగా స్టేడియంలో కూర్చుంటున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు రేడియో రిసీవర్ పెట్టుకొని మరి… టీమిండియా వైఫల్యాలను గమనిస్తున్నాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తూ మహేంద్రసింగ్ ధోని రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. కావాలనే బిసిసిఐ… మహేంద్ర సింగ్ ధోనీని స్టేడియానికి పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని నివేదికలు వచ్చాయట. అందుకే మహేంద్రుడిని బరిలోకి దింపారని అంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి మ్యాచ్ కు మహేంద్ర సింగ్ ధోని వెళ్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ముందు జరగబోయే మ్యాచ్ లకు కూడా ధోని వెళ్తాడని అంటున్నారు. అయితే, జరుగుతోన్న ప్రచారం ప్రకారం..గంభీర్ ను కాదని మహేంద్ర సింగ్ ధోనీనే మెంటార్ లేదా హెడ్ కోచ్ గా నియామకం చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, టీమిండియా అద్భుతమైన విజయాలు నమోదు సాధించడం ఖాయం అంటున్నారు.
#WATCH कैप्टन कूल' का कूल अंदाज़,मैच से ज्यादा वायरल हुए MS Dhoni,भारत-इंग्लैंड पहले वनडे में पॉपकॉर्न खाते दिखे MS Dhoni, नन्हे फैन संग बिताया खास पल,मैदान पर नहीं, स्टैंड्स में छाए 'कैप्टन कूल' !
.
.#MSDhoni #Dhoni #CaptainCool #INDvsENG #IndiaVsEngland #TeamIndia #Cricket pic.twitter.com/3M18CVwkVJ— Anmol Sandesh (@AnmolSandesh) July 15, 2026