BigTV English

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Dhoni – Abhishek :  దేశంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన ఓ ఎస్బీై బ్రాంచ్ నుంచి సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ క్లర్క్ చాలా మంది కస్టమర్ల ఖాతాల నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని పరారైన ఘటన సంచలనం రేపుతోంి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, క్రెడిట్ లిమిట్ ల నుంచి డబ్బు కాజేసిన ఈ మోసగాడు, బ్యాంకు కస్టమర్ల జీవితాలను ఆర్తికంగా గందరగోళంలోకి నెట్టాడు. ఈ ఘటన పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోని సదీక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో చోటు చేసుకుంది. ఎం.ఎస్. దోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పటి నుంచి SBI కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారు. ముఖ్యంగా SBI అతన్ని ప్రకటనలు, ప్రచారాల్లో కనిపించేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.


Also Read :  Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

SBI ప్రచారాల్లో ధోనీ.. 


ఇక ప్రకటనలు, ప్రచారాల్లో కనిపించినందుకు ధోనీ గణనీయమైన రుసుమును సంపాదిస్తాడు. దీంతో అదేవిధంగా SBI అభిషేక్ బచ్చన్ బంగ్లా.. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీస్ స్థలంగా ఉపయోగించడానికి అద్దెకు తీసుకుంటుంది. ఇది దీర్ఘకాలిక ఒప్పందం.. ప్రారంభంలో నెలవారి అద్దె చెల్లింపులు రూ.19లక్షలు.. ఇక 5 నుంచి 10 సంవత్సరాల తరువాత వరసగా రూ.23.6 లక్షలు,  రూ.29లక్షలకు పెరుగుతుంది. SBI ఖాతాదారులకు మోసం జరిగిన విషయం తెలిసిందే. అయితే ధోనీకి రూ.6కోట్లు ఇవ్వనుంది SBI. ఈ మోసం జరిగినప్పటికీ.. వారికి మాత్రం ఒప్పందం ప్రకారం.. చెల్లించాల్సిన డబ్బు చెల్లించాల్సిందే. అందుకే ధోనీకి రూ.6 కోట్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు చాలా మంది కస్టమర్లు కన్నీరు పెడుతున్నారు. పరమ్ జిత్ కౌర్ అనే కస్టమర్ తన భర్తతో కలిసి ఉన్న రూ.22లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా ఖాలీ కావడంతో కన్నీరు మున్నీరు అయింది.

సమాచారం లేకుండా డబ్బు మాయం 

మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బు మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మరో కస్టమర్ సందీప్ సింగ్ నాలుగు ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇప్పుడు కేవలం రూ.50వేలు మాత్రమే మిగిలాయని చెప్పాడు. మా కష్టార్జితం ఇలా పోతుందని ఊహించలేదని బాధను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ మోసం విలువ దాదాపు రూ.5కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు అధికారులు ఈ ఘటన పై సమీక్ష నిర్వహిస్తున్నారు. కస్టమర్ల డబ్బులు తిరిగి ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ సుశాంత్ అరోరా, తాను ఇటీవలే బ్రాంచ్ లో చేరానని కస్టమర్ల ఫిర్యాదులతోనే ఈ మోసం గురించి తెలిసిందని చెప్పారు. సదీక్ బ్రాంచ్ ఇన్ చార్జీ నవదీప్ భట్టి, క్లర్క్ అమిత్ ధింగ్రా పై నాలుగు ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోలీసులు ఇక మోసం ఘటన పై విచారణ చేపడుతున్నారు. ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే చాలా సేఫ్ గా ఉంటుందనుకుంటే బ్యాంకుల్లో మోసం జరిగితే ఏం చేయాలని బాధపడటం గమనార్హం.

Related News

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

Big Stories

×