BigTV English

MI VS GT: అదరగొట్టిన సాయి సుదర్శన్… ముంబై టార్గెట్ ఎంతంటే ?

MI VS GT: అదరగొట్టిన సాయి సుదర్శన్… ముంబై టార్గెట్ ఎంతంటే ?

MI VS GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2025 Tournament )
భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. జట్ల ( Gujarat Titans vs Mumbai Indians ) మధ్య 9వ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో…. ఇవాళ గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium in Ahmedabad ) జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేస్తుందని అందరూ అంచనా వేశారు.


Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

తమ హోమ్ గ్రౌండ్ కాబట్టి… కచ్చితంగా… దుమ్ము లేపుతానని అందరూ అనుకున్నారు. కానీ తక్కువ స్కోరుకే పరిమితమైంది గుజరాత్ టైటాన్స్. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన గుజరాత్ టైటాన్స్… ఎనిమిది వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అంటే… ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలంటే… నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ ( Sai Sudarshan ) అలాగే శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) ఇద్దరూ ఓపెనింగ్ అదరగొట్టారు. కానీ ఆ ఇన్నింగ్స్ ను… చివరి వరకు కొనసాగిస్తే భారీ స్కోర్ చేసేది గుజరాత్. కానీ మొదట గిల్ అవుట్ కాగా ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.


Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

మెరిసిన సాయి సుదర్శన్

ఇవాల్టి మ్యాచ్ లో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 153 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపిన సాయి సుదర్శన్ ( Sai Sudarshan )  2 సిక్సర్లు కొట్టాడు. అలాగే నాలుగు బౌండరీలు దంచి కొట్టాడు. అటు గుజరాత్ కెప్టెన్ గిల్ (Shubman Gill)… 27 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. మూడో వికెట్ కు వచ్చిన జోష్ బట్లర్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు అవుట్ అయిన తర్వాత… జట్టును ముందుకు నడిపించే నాధుడే కనిపించలేదు. ఎవరో ఒకరు మిడిల్ ఆర్డర్లో కాస్త క్లిక్ అయితే.. 250 వ రకు గుజరాత్ కొట్టేది. కానీ 196 పరుగుల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. అటు ముంబై బౌలర్లలో.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Haridk pandya) రెండు వికెట్లు తీశాడు. సత్యనారాయణ రాజు ఒక వికెట్ తియ్యగా బోల్ట్, చాహర్ అలాగే ముజీబ్ తలో వికెట్ తీశారు. దీంతో 20 ఓవర్లలో 197 పరుగులు ముంబై ( Mumbai Indians) చేస్తే విజయం సాధిస్తుంది. రెండవ ఇన్నింగ్స్ మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది.

 

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×