BigTV English
Advertisement

Paris Paralympics 2024: నేటి నుంచి పారిస్‌ పారా ఒలింపిక్స్‌.. ఉత్సాహంగా భారత్‌

Paris Paralympics 2024: నేటి నుంచి పారిస్‌ పారా ఒలింపిక్స్‌.. ఉత్సాహంగా భారత్‌

ఇప్పటికే నదీ ప్రాంగణమంతా రంగురంగుల లైట్లతో ముస్తాబైంది.  11 రోజుల పాటు సాగనున్న మెగాటోర్నీలో 168 దేశాల నుంచి 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో 549 పతకాల కోసం పోటీపడనున్నారు.

మన భారతదేశం నుంచి ఈసారి 84 మంది క్రీడాకారులు బయలుదేరారు. వీరు 12 విభాగాల్లో పతకాల వేట కొనసాగించనున్నారు.  టోక్యో పారాలింపిక్స్‌ (2020)లో ఐదు స్వర్ణాలతో కలిపి, మొత్తం 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి ఆ నెంబర్ ను పెంచాలని పట్టుదలతో ఉన్నారు.


పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో సుమిత్‌ అంటిల్‌, భాగ్యశ్రీ జాదవ్‌ జాతీయ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. పారా ఒలింపిక్స్ లో చరిత్రలోనే స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో తొలిసారి ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇకపోతే పారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయో అక్కడే పారా ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.

ఎప్పటిలాగే చైనా ఈసారి కూడా సత్తా చాటాలని చూస్తోంది. టోక్యో పారా ఒలింపిక్స్ లో 96 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి అదే రీతిలో రికార్డును కాపాడుకోవాలని చూస్తోంది. ఇక వీటితో పాటు అదిరే ప్రదర్శనలు, అద్భుత విన్యాసాలు ఉండనున్నాయని అంటున్నారు.

Related News

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Big Stories

×