E-Paper
Advertisement

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ
Advertisement

IND vs PAK:  హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025 ) ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి జరగనున్న ఈ టోర్నమెంట్ ఈనెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan, Pool C ) మధ్య రసవత్తర ఫైట్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కొంప ముంచింది వ‌ర్షం. మ్యాచ్ జ‌రుగుతున్న క్ర‌మంలో భారీ వ‌ర్షం ప‌డింది. దీంతో మ్యాచ్ ను అర్థాంత‌రంగా ఆపేశారు. మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభం అయ్యే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో, డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధతి ( (DLS Method)) ప్ర‌కారం…టీమిండియాను విజేత‌గా ప్ర‌క‌టించారు. దీంతో 2 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే కువైట్ పైన విజయం సాధించిన పాకిస్తాన్..ఇందులోనూ గెలిచేది. కానీ వ‌ర్షం కార‌ణంగా టీమిండియా విజ‌యం సాధించింది.

Also Read: Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

పాకిస్తాన్ చేతిలో టీమిండియా దారుణ ఓట‌మి

Advertisement

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా జ‌రిగిన ఈ మ్యాచ్ లో మొద‌ట టీమిండియా బ్యాటింగ్ చేసి,86 ప‌రుగులు చేసింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో అద్భుతంగానే రాణించింది పాకిస్తాన్‌. 3 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ఒక వికెట్ కోల్పోయిన పాకిస్తాన్‌.. 41 ప‌రుగులు చేసింది. ఈ త‌రుణంలోనే వ‌ర్షం ప‌డింది. అప్ప‌టికీ టీమిండియా కంటే 2 ప‌రుగులు వెన‌క‌పడింది పాకిస్తాన్‌. దీంతో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధతి ప్ర‌కారం…టీమిండియాను విజేత‌గా ప్ర‌క‌టించారు.

బ్యాటింగ్ లో తేలిపోయిన టీమిండియా

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025 ) లో భాగంగా జ‌రిగిన‌ ఇవాల్టి మ్యాచ్ లో టాస్ ఓడిపోయి టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు మాత్రమే చేసింది. ఓపెన‌ర్ గా వచ్చిన రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) 11 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ చిలిపి 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి.

Advertisement

ఇక బిన్నీ రెండు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చివరలో వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ ( Dinesh Karthik) 6 బంతుల్లో 17 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. దీంతో ఆరు ఓవర్లలో 86 పరుగులు చేసింది టీం ఇండియా. అయితే, వ‌ర్షం వ‌ల్లే, టీమిండియా విజ‌యం సాధించింది. ఇక ఈ విజ‌యంతో పాయిట్ల ప‌ట్టిక‌లో పాకిస్తాన్ ర‌న్ రేట్ ప్ర‌కారం మొద‌టి స్థానంలో నిలిచింది. టీమిండియా రెండో స్థానంలో నిలిచింది.

Also Read: Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×