PSL 2025: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan ) మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ డ్రోన్లు వేయడంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ వెంటనే తిప్పి కొట్టింది. అక్కడితో ఆగకుండా పాకిస్థాన్లో భూస్థాపితం చేసేందుకు త్రివిధ దళాలను బరిలోకి దించింది. అయితే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కొనసాగే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ టోర్నమెంట్ జరుగుతుందో లేదో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇటు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తాజాగా.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ధర్మశాల మ్యాచ్ రద్దు అయింది.
Also Read: Anushka – Virat Kohli: కోహ్లీ కాపురంలో చిచ్చు పెట్టిన అవ్నీత్.. హ్యాండ్ ఇచ్చిన అనుష్క !
పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakisthan Cricket Board) ప్రస్తుతం అత్యంత ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంటును ( (Pakistan Super League 2025)) ప్రారంభించింది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ టోర్నమెంట్ రద్దు చేస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు నష్టమే జరుగుతుంది. అందుకే చాలా తెలివిగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను విదేశాలకు తరలించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
UAE లో పాకిస్తాన్ సూపర్ లీగ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ను (Pakistan Super League 2025) యూఏఈ ( Uae) అరబ్ కంట్రీ కి తరలిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. ఎనిమిది మ్యాచ్లో అనే పద్యంలో టోర్నమెంట్ మొత్తాన్ని రద్దు చేసే కంటే.. విదేశాలను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట.
దీంతో ఈ ఎనిమిది మ్యాచ్లు యూఏఈ లో నిర్వహించేందుకు… నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. దీంతో తర్వాత జరిగే మ్యాచ్ లన్ని యూఏఈ లో జరగను. ఇది ఇలా ఉండగా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… పాకిస్తాన్ ఓటమి దిశగా వెళుతుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న అన్ని స్థావరాలను ఇండియా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఇంటి దగ్గరే బాంబు పేల్చింది ఇండియా. దీంతో పాకిస్తాన్ దేశాన్ని వదిలి వేరే దేశాలకు పారిపోతున్నాడట ప్రధాని షరీఫ్.
Also Read:BCCI: ఇక హైదరాబాద్, ముంబైలోనే IPL 2025 మొత్తం మ్యాచ్ లు..స్పెషల్ ట్రైన్ లో ప్లేయర్స్