Ricky Ponting Warns Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2026-2027 టోర్నమెంట్ లో (World Test Championship 2026-2027 Tournament ) భాగంగా టీమిండియా ( Team India) మరో రెండు సిరీస్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటి నుంచే కసరతులు మొదలుపెట్టింది టీం ఇండియా. ఈ రెండు జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుండగా.. ఇందులో కచ్చితంగా ఆరు గెలవాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీం ఇండియాను వైట్ వాష్ చేయడం గ్యారెంటీ అని హెచ్చరించారు. భారత మైదానాలలో టీమ్ ఇండియాను ఓడించడం చాలా సులభం అంటూ హేళన చేస్తూ మాట్లాడారు రికీ పాంటింగ్. దీంతో టీమిండియా పై ( Team India) రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అతి త్వరలో జరగబోతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో రికీ పాంటింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియాను చిత్తుగా ఓడించి, వైట్ వాష్ చేస్తామని హెచ్చరించారు. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవనివ్వబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో గెలవడం తమకు ఎప్పుడు కష్టమైన విషయమే.. కానీ ప్రస్తుత పరిస్థితులలో టీమిండియాను సులభంగా ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే సొంత గడ్డపై న్యూజిలాండ్ తో పాటు దక్షిణాఫ్రికా ( South africa) చేతుల్లో టీమిండియా ( Team India) ఓడిపోయిందని పరువు తీసుకుందని హేళన చేశారు. ఇదే ఆస్ట్రేలియా జట్టుకు ఊరట ఇచ్చే అంశం అని వ్యాఖ్యానించారు. సొంత గడ్డపై మరిన్ని మ్యాచ్ లు గెలవాలంటే, ఇండియా తమ పిచ్ లను సిద్ధం చేసే విధానంపై కాస్త శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లను తయారు చేయడంలో వారు అతి చేశారని తమ అభిప్రాయం అన్నారు.
ఆ మైదానాలను ఎదుర్కోవడంలో వారి సొంత బ్యాటర్ల ఇబ్బంది పడుతున్నారని హేళన చేస్తూ మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్స్ బరిలో నిలవాలంటే టీమిండియా కచ్చితంగా మరో 6 లేదా ఏడు మ్యాచ్ లు గెలవాల్సిందే. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 సైకిల్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమేనని అంటున్నారు.