Virender Sehwag On RCB: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (Afghanistan vs. Team India) మధ్య ఈ నెలలో టీ20 సిరీస్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో కాకుండా ముందుగా బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడాల్సి ఉంది టీమిండియా. కానీ చివరికి క్షణంలో బిసిసిఐ రూట్ మార్చింది. బంగ్లాదేశ్ తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం మూడు టి20లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈనెల 13వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ కూడా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య 3 టీ20ల సిరీస్ జరగనున్న నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును తాజాగా బీసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొనసాగనున్నారు. తిలక్ వర్మ, సంజు శాంసన్, కిషాన్ ఇషన్, శివం దుబే, హర్షిత్ రాణా, తిలక వర్మ లాంటి వాళ్లను మాత్రమే తీసుకున్నారని , కానీ రాయల్ ఛాలెంజర్స్ జట్టుటకు సంబంధించిన ప్లేయర్లను మాత్రం తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి ఈ తరుణంలోనే రాయల్ ఛాలెంజర్స్ జట్టుటకు సంబంధించిన ప్లేయర్లను తీసుకోకపోవడంపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.
ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించగా.. ఇందులో ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు లేకపోవడం చాలా దుర్మార్గమని ఫైర్ అయ్యారు. వాళ్లు ఏం పాపం చేశారని బెంగళూరు ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. వరుసగా రెండు ట్రోఫీలు అందుకున్న నేపథ్యంలో బెంగళూరు ఆటగాళ్లపై ఇలా కసి తీర్చుకుంటున్నారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఇందులో ఎవరో ఒక్కరిని తీసుకున్న బాగుండు అని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచనలు చేశారు. కనీసం ఒక్కరికైనా స్థానం కల్పించి ఉంటే.. బెంగళూరు అభిమానులైన సంబరపడి పోయేవారని వ్యాఖ్యానించారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేనప్పుడు వారు అంత నిలకడగా రాణించడం వల్ల ప్రయోజనం ఏముంది? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్.