E-Paper
Advertisement

Sahibzada Farhan: ప‌దే ప‌దే ఇండియాను ఓడించ‌డం ఇష్టం లేదు, అందుకే జాలి పడి వ‌దిలేశాం !

Sahibzada Farhan: ప‌దే ప‌దే ఇండియాను ఓడించ‌డం ఇష్టం లేదు, అందుకే జాలి పడి వ‌దిలేశాం !

Sahibzada Farhan:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా టీమిండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించడంపై పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) స్పందించారు. ఇండియాను పదే పదే ఓడించడం ఇష్టం లేక ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాను చూస్తే , జాలి వేస్తోందని… ప్రతిసారి టీమిండియాను ఓడించడం దండగే అనిపించిందని సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ వ్యాఖ్యలు చేశాడా ? లేక కొంత మంది పోస్టులు క్రియేట్ చేశారా ? అనేది తెలియదు కానీ.. అతడు చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఒకసారి గత రికార్డులను పరిశీలించు.. ఇండియా ఓడిపోయిందా? పాకిస్తాన్ ఓడిపోయిందా ? అనే విష‌యం తెలుస్తుందని కౌంటర్లు పేల్చుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!ప‌దే ప‌దే ఇండియాను ఓడించ‌డం ఇష్టం లేదు, అందుకే జాలి పడి వ‌దిలేశాం !

ప‌దే ప‌దే ఇండియాను ఓడించ‌డం ఇష్టం లేదు, అందుకే జాలి పడి వ‌దిలేశాం !

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఈ వారం చివరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 8వ తేదీ వరకు బ్రహ్మాండంగా కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను వద్దనుకుంటోంది పాకిస్తాన్ టీం. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేస్తూ బహిష్కరించేసింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు విస్మయం చెందుతున్నారు.

పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నామని పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండియాతో ఆడడం తమకు ఇష్టమేనని వెల్లడించారు. కానీ ఇండియాకు భయపడి మాత్రం ఈ మ్యాచ్ ను బహిష్కరించడం లేదని వ్యాఖ్యానించారు ఫర్హాన్.

పదేపదే ఇండియాను ఓడించడం తమకు నచ్చడం లేదని.. జాలిపడి ఈ మ్యాచ్ ను వదిలేస్తున్నట్లు వింత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పాత రికార్డులను ముందు పెట్టి ఫర్హాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కానీ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan )  మాత్రం పాకిస్తాన్ గెలిచినట్లు విర్రవీగుతున్నాడని ఫైర్ అవుతున్నారు.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×