Ind vs Pak Match-fixing: ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) నేపథ్యంలో ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ ఇండియా అండర్ 19 ( India U19 vs Pakistan U19) జట్ల మధ్య బిగ్ ఫైట్ బులవాయే ( Queens Sports Club, Bulawayo) వేదికగా నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలో 252 పరుగులు సాధించి ఆలౌట్ అయింది అండర్ 19 టీమిండియా. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇండియాతో పాకిస్తాన్ అండర్ 19 జట్టు మెంటర్ సర్ఫరాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed) ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ నిర్వహిస్తున్న మ్యాచ్ సందర్భంగా మొబైల్ ఫోన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో అస్సలు వాడకూడదు. కానీ మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ అహ్మద్ దొరికిపోయాడు. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Yuvraj Singh: యువరాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోటల్ లో చెప్పులు కూడా !
ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇవాళ గ్రూప్ స్టేజిలో కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళనుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకము. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన మెంటర్ సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి సంబంధించిన కొంత మందితో సర్ఫరాజ్ అహ్మద్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఐసీసీ నిర్వహించే ప్రతి టోర్నమెంటులో డ్రెస్సింగ్ రూమ్ లో అలాగే మ్యాచ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడకూడదు. ఇంటర్నెట్ ఉండే ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు వాడకూడదని రూల్స్ స్పష్టంగా ఉన్నాయి.
కానీ సెమీ ఫైనల్ కు ముందు కీలక మ్యాచ్ అయిన ఇందులో సర్ఫరాజ్ అహ్మద్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకే 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ 7వ ఓవర్ లో అద్భుతమైన క్యాచ్ ఇస్తే, పాకిస్తాన్ ప్లేయర్లు వదిలేసారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయానికి రన్ ఔట్ కూడా కావాలనే మిస్ చేశారని పాకిస్తాన్ ప్లేయర్లపై ప్రచారం జరుగుతోంది. దీని అంతటికి కారణం మెంటర్ సర్ఫరాజ్ అహ్మద్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని ఫిక్స్ కావాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 252 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఇక 253 పరుగులు పాకిస్తాన్ సాధిస్తే, విజయం సాధించనుంది.
How come Sarfaraz Ahmed (mentor of Pakistan U19) is allowed to use his phone during the ongoing U19 World Cup game between India and Pakistan, when ICC strictly bans the use of mobile phones inside the dressing rooms! 👀 #INDvsPAK #U19WorldCup | 📸 : JioStar pic.twitter.com/a2Mw29lPqe
— OneCricket (@OneCricketApp) February 1, 2026
Pakistan and their never ending love story with their fielding. 😭#INDvsPAK #U19WorldCup2026pic.twitter.com/9GSnEcHHW0
— GAURAV (@crazyGaurav_) February 1, 2026