Shahid Afridi: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడు ఓటములు చవి చూసిన పాకిస్తాన్ మహిళల జట్టు (pakistan women team)… ఎలిమినేట్ అయింది. గ్రూప్ స్టేజిలోనే రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే… తట్టా బుట్టా సర్దేసింది. అయితే ఈ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ మహిళల జట్టు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు సంబంధించిన జై షా ( Jay Shah) ఐసీసీ (ICC ) చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో… తమ మహిళల జట్టు కావాలనే ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. అతని చేతుల మీదుగా ఐసీసీ ట్రోఫీ అందుకోవాల్సి వస్తుందని.. ముందే గ్రహించిన పాకిస్తాన్ మహిళల జట్టు, దేశ పరువు కాపాడేందుకు ఎలిమినేట్ అయిందని వ్యాఖ్యానించాలి. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్… ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టు పై అభిమానులు సీరియస్ అవుతున్నారు. మరి కొంత మంది ఆ జట్టును ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) మాత్రం చాలా డిఫరెంట్ గా స్పందించారు. ఐసీసీ బాస్ జై షా ( ICC Boss Jay Shah) చేతుల మీదుగా మహిళల ప్రపంచ కప్ అందుకోవడం ఇష్టం లేక.. పాకిస్తాన్ ముందే ఎలిమినేట్ అయిందని వ్యాఖ్యానించారు.
ఈ టోర్నమెంట్ లో టైటిల్ గెలిస్తే… ఒక ఇండియా ( India) వాడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాంటి దౌర్భాగ్యం పాకిస్తాన్ జట్టుకు లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పరువు కాపాడేందుకుగాను ఫాతిమా సనా టీమ్… ఈ టోర్నమెంట్ నుంచి కావాలని ఎలిమినేట్ అయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఆడడం చేతకాదు కానీ…. ఇలాంటి వెధవ కారణాలు ఎన్నో చెబుతారని ట్రోల్ చేస్తున్నారు. ఓడియారని అందరూ అవమానిస్తారని, ఇలాంటి తప్పుడు కూతలు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) కూస్తున్నాడని ఆగ్రహించారు.