Kamran Akmal On Hardik Padya: 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే టీమిండియాలో సిద్ధం చేసే పనిలో పడ్డాడు గౌతమ్ గంజేరు. ఈ క్రమంలో అత్యంత భయంకరమైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) ఘోర అవమానం జరిగింది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్ లో హార్దిక్ పాండ్యా ఉండడం కష్టమేనని గౌతమ్ గంభీర్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. హార్థిక్ పాండ్యా ప్రస్తుత పరిస్థితుల్లో 10 ఓవర్ల కోటా, ఫినిష్ చేయడం కష్టమేనని ఆయన వెల్లడించారట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా స్పందించారు. హార్దిక్ పాండ్యా కంటే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చాలా బెటర్ అని ఆయన కూడా కుండ బద్దలు కొట్టి చెప్పారు.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా కు నితీష్ కుమార్ రెడ్డి అవసరం చాలా ఉందని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడని.. అలాంటి వారివల్ల టీమిండియాకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆయన వెల్లడించారు. టీమిండియాకు నేనొక్కడినే ఆల్ రౌండర్ అనే పొగరు హార్థిక్ పాండ్యాలో ఉందని.. ఆ అహంకారం వల్ల హార్దిక్ పాండ్యా కు టీమిండియాలో అవకాశాలు రావడంలేదని సీరియస్ అయ్యారు. ఈ సమయంలోనే అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడని వెల్లడించారు. వికెట్లు తీయడంతో పాటు… కన్సిస్టెంట్ గా 30 నుంచి 40 పరుగులు చేయగల సత్తా నితీష్ కుమార్ రెడ్డిలో ఉందని ప్రశంసించారు. నితీష్ కుమార్ రెడ్డి కారణంగానే సన్రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో అద్భుతంగా రాణించినట్లు గుర్తు చేశారు.
గౌతమ్ గంభీర్ చెప్పినట్లుగా హార్దిక్ పాండ్యా ప్రస్తుత పరిస్థితిలో 10 ఓవర్లు వేయడం కష్టమేనని కమ్రాన్ అక్మల్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తరచూ అతడు గాయాల బారిన పడుతున్నాడని.. గుర్తు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఒకటి కూడా హార్దిక్ పాండ్యా ఆడలేదని వెల్లడించారు. బ్యాక్ పెయిన్ కారణంగా అతడు బౌలింగ్ అద్భుతంగా వేయడం కష్టమేనని తెలిపారు. ముంబై ఇండియన్స్ తరఫున కూడా కెప్టెన్ గా విఫలమయ్యాడని విమర్శించారు. క్రికెట్ కంటే అతడికి అమ్మాయిల సోకు ఎక్కువ అంటూ విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి.. మహిళతో ఎంజాయ్ చేయాలని చురకలు అంటించారు.