E-Paper
Advertisement

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్
Advertisement

Virender Sehwag On Rahane Retirement:  టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ (Ajinkya Rahane Retirement) ప్రకటించారు. అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు రహానే. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. జీవితంలో ప్రతి పనికి ఆరంభం… అదే సమయంలో ముగింపు ఉంటుందని.. అందుకే ఇవాళ ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందంటూ రహానే వ్యాఖ్యానించారు. దీంతో అజింక్య రహానే ఇరవై ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. అయితే అజింక్య రహనే ఎమోషనల్ రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. గౌతమ్ గంభీర్ (Virender Sehwag ) లాంటి వెధవల వల్ల… రహానే రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని బాంబు పేల్చారు. అవకాశాల కోసం ఎదురుచూసి చూసి, మరో దిక్కు లేక రిటైర్మెంట్ ఇచ్చాడని పేర్కొన్నారు. అజింక్య రహానే (Ajinkya Rahane ) టాలెంట్ ను గుర్తించకపోవడం కారణంగానే అతను ఈ నిర్ణయానికి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

రహానేను త‌క్కువ చేసి చూశారు..అవ‌మానాలు భ‌రించ‌లేక‌నే రిటైర్మెంట్

Advertisement

అజింక్య రహానే రిటైర్మెంట్ పై వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అజింక్య రహానే సామర్థ్యానికి తగ్గ గుర్తింపు టీమ్ ఇండియాలో రాలేదని ఎమోషనల్ అయ్యారు. ఎవరు అంచనా వేయలేని విధంగా అతడు ఆడతాడని…కానీ అతని టాలెంట్ గుర్తించడంలో బీసీసీఐ విఫలమైందని సీరియస్ అయ్యారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రహానేకు టీమిండియా నుంచి పిలుపు రాలేదని కీలక విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే అజింక్య రహానే రిటైర్మెంట్ దాకా వెళ్లాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే గౌతమ్ గంభీర్… గొప్పగా ఆలోచించి అజింక్య రహానే లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఉంటే, టెస్ట్ క్రికెట్ లో టీమ్ ఇండియా మరిన్ని విజయాలను నమోదు చేసుకునేదని వివరించారు. కానీ అతని సెల్ఫిష్ నెస్ కారణంగా అజింక్య రహానే లాంటి గొప్ప ప్లేయర్లు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే రిటైర్మెంట్లు ప్రకటించాల్సి వస్తోందని ఎమోషనల్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తెచ్చిన ఘనత ర‌హానేదే

Advertisement

ఆస్ట్రేలియా గడ్డపై 2021 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియాకు అందించిన ఘనత అజింక్య రహానేకు దక్కుతుందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే చారిత్రాత్మక విజయమని గుర్తు చేశారు. ఇలాంటి విజయాలను మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో కూడా టీమిండియా అందుకోలేదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా.. 20 ఏళ్ల పాటు టీం ఇండియాకు సేవలు చేసిన అజింక్య రహానేకు.. సరైన రిటైర్మెంట్ దక్కలేదని ఫైర్ అయ్యారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

Related News

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

మ‌రోసారి ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్‌..టైమింగ్స్‌, స్ట్రీమింగ్ ఎక్క‌డంటే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టికొట్టిన యాజ‌మాన్యం…టీమిండియాతో మ్యాచ్ ర‌ద్దు !

పాకిస్తాన్ అంటేనే చిరాకు..ఇక జ‌న్మ‌లో నా దేశంలో అడుగు పెట్ట‌ను

వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ ను ఆడించాల‌ని, గిల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు

Big Stories

Advertisement
×