Shoaib Akhtar Reaction On Indian Women’s Team: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ట్రోఫీపై వివాదం రాజు కుంటోంది. ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా ఉమెన్స్ టీం.. మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీని అందుకోకుండానే ఇండియాకు వచ్చేసింది. అయితే టీమిండియా తీసుకున్న ఈ నిర్ణయం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తుంటే… ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండ నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) హాట్ కామెంట్స్ చేశారు. మొహ్సిన్ నఖ్వీ (ACC Chairman Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా.. ఇకపై పాకిస్తాన్ తో ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని బాంబు పేల్చారు. పాకిస్తాన్ తో సంబంధాలు మొత్తం తెంచుకోవాల్సిందే అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన హాట్ కామెంట్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (A C C) రూల్స్ ప్రకారం చేతుల మీదుగా టీమిండియా ( Team India) ట్రోఫీ తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) వెల్లడించారు. ACC అనేది బహుళ దేశాలు పాల్గొని అంతర్జాతీయ టోర్నమెంట్ అని గుర్తు చేశారు. ఇందులో ఇండియాకు స్పెషల్ గా కేటగిరీలు ఏమి ఉండవని కౌంటర్ ఇచ్చారు. చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) చేతుల మీదుగానే ప్రతి ఒక్కరు టైటిల్ అందుకోవాలని వెల్లడించారు. ఇండియాకు సంబంధించిన అధికారి మొహ్సిన్ నఖ్వీ స్థానంలో ఉంటే.. పాకిస్తాన్ కూడా ట్రోఫీ తీసుకోవాల్సి ఉంటుందని చురకలు అంటించారు.
అనవసరంగా క్రీడాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సూర్య కుమార్ యాదవ్ తో పాటు హర్మన్ ప్రీత్ కౌర్…ACC కార్యాలయానికి వచ్చి ట్రోఫీ నిర్మొహమాటంగా తీసుకు వెళ్ళవచ్చని స్పష్టం చేశారు. అలా కాదని… చిల్లర వేషాలు వేస్తే పాకిస్తాన్ తో ఇకపైన మ్యాచ్ లు ఆడద్దని సీరియస్ అయ్యారు. ఐసీసీ కూడా భవిష్యత్తులో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి మ్యాచ్ లు పెట్టొద్దని కోరారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ).