Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో దాదాపు 50 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మరో 20కి పైగా మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ మొత్తం ఫినిష్ అవుతుంది. మే 31వ తేదీ లోపు ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తి కానుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై ( Pakistan Super League 2026 Tournament) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag). ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో నిర్వహించే వేలంలో అమ్ముడు పోని ప్లేయర్లు మాత్రమే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో దర్శనమిస్తారని పరువు తీశారు వీరేంద్ర సెహ్వాగ్. తనను ఎవరు కొనబోరని భయపడి కూడా కొంతమంది పాకిస్తాన్ పారిపోతున్నారని ర్యాగింగ్ చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్చి 26వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొన్న మే మూడవ తేదీన టోర్నమెంట్ కూడా ఫినిష్ అయింది. అయితే ఈ టోర్నమెంట్ కొనసాగిన మొదటి నుంచి చివరి వరకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను కించపరుస్తూ మాట్లాడారు. ఐపీఎల్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పది అంటూ విర్రవీగారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప ఏది ఉండదని.. అసలు ప్లేయర్లకు రెస్పెక్ట్ అనేది ఇవ్వబోరని పేర్కొన్నారు.
ఐపీఎల్ ఆడే ప్లేయర్ లందరూ పాకిస్తాన్ సూపర్ లింక్ టోర్నమెంటులోకి రావాలని సోషల్ మీడియా వేదికగా బంపర్ ఆఫర్లు ప్రకటించారు అక్కడికి మాజీ క్రికెటర్లు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎంత వాగినా కూడా చాలామంది ప్లేయర్లు అక్కడికి వెళ్లలేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేయించుకున్న ప్లేయర్లు కూడా… రిటర్న్ వచ్చి ఐపిఎల్ లో చేరిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంజమామ్-ఉల్-హక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వదిలి పీఎస్ ఎల్ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్ PSL అని, అందుకే ఐపీఎల్ ను వదిలి, పాకిస్తాన్ కు వస్తున్నారని చెప్పారు ఇంజమామ్.
ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు వీరేంద్ర సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను వదిలి, వేరే టోర్నమెంట్ లోకి వెళ్లే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. ఐపీఎల్ లో అన్ సోల్డ్ ప్లేయర్లు, రిటైర్మెంట్ ప్లేయర్లు మాత్రమే PSLలోకి వెళతారని చురకలు అంటించారు వీరేంద్ర సెహ్వాగ్.
Also Read: Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed