MS Dhoni: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులను ఇప్పటికే 150 మందికి పైగా చంపేసిన ఇండియన్ ఆర్మీ… అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కు కూడా నరకం చూపిస్తోంది. దాదాపు పాకిస్తాన్ సైన్యాన్ని అంతం చేసే దిశగా ఇండియన్ ఆర్మీ దూసుకు వెళ్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీకి కీలక పిలుపు వచ్చినట్లు సమాచారం అందుతుంది.
Also Read: Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు
యుద్ధ రంగంలోకి మహేంద్రసింగ్ ధోని ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొన్నటి వరకు చాలా బిజీగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని… ఇప్పుడు యుద్ధరంగంలోకి దిగబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యానికి సహాయం అందించాలంటూ మహేంద్రసింగ్ ధోని కి పిలుపు వచ్చింది అంట. ఇండియాకు సంబంధించిన టెరిటోరియల్ ఆర్మీకి.. రక్షణ మంత్రిత్వ శాఖ… నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
యుద్ధం సమయంలో తమకు సహాయం చేయాలని టెరిటోరియల్ ఆర్మీకి.. పిలుపు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో భారత సైన్యానికి అనుబంధంగా ఉంటూ టెరిటోరియల్ ఆర్మీ… చేయూత అందించబోతోంది. అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీలో మహేంద్రసింగ్ ధోని కూడా ఉన్నారు. టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే టెరిటోరియల్ ఆర్మీలో చేరారు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ సహాయం కావాల్సి వచ్చిన నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని కూడా యుద్ధరంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
ఈ టెరిటోరియల్ ఆర్మీలో కపిల్ దేవ్ కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని రణ రంగానికి దిగుతాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని పాకిస్తాన్ పై యుద్ధానికి దిగితే… పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి మహేంద్ర సింగ్ ధోని యుద్ధం చేసేందుకు రంగంలోకి దిగితే చూసేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారు. అయితే ఒకవేళ యుద్ధరంగంలోకి మహేంద్ర సింగ్ ధోని చేరితే… కేవలం సైన్యానికి సలహాలు అలాగే సూచనలు చేయబోతున్నారని సమాచారం.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో విఫలమైన ధోని టీం
ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఈసారి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నమెంట్… ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వైదొలిగింది. అటు మహేంద్ర సింగ్ ధోనీ కూడా పెద్దగా బ్యాటింగ్ కూడా చేయడం లేదు.