ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్జ్ ( Royal Challengers Bengaluru Women vs UP Warriorz Women ) మధ్య మ్యాచ్ వడోదర వేదికగా జరిగింది. ఇందులో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 8 వికెట్లు నష్టపోయిన యూపీ వారియర్జ్ 143 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బెంగళూరు జట్టు చాలా ఆచితూచి ఆడింది. 13.1 ఓవర్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అటు యూపీ ఎలిమినేట్ అయింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే ఫైనల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకు వెళ్లింది. అటు యూపీ ఎలిమినేట్ అయినట్లే అని చెప్పవచ్చు. యూపీ తన లీగ్ దశలో ఢిల్లీతో ఒక్క మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచినా ప్రయోజనం ఉండదు. కాబట్టి యూపీ ఎలిమినేట్ అయినట్లు చెప్పుకోవచ్చు. అంటే రెండో ఫైనలిస్ట్ గా గుజరాత్, ముంబైకి ఎక్కువ అవకాశం ఉండగా ఢిల్లీకి ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ఈ మూడు జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. జనవరి 30 అంటే రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ మధ్య ఫైట్ జరగనుంది. ఇందులో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టిక ప్రకారం ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి వస్తుంది.
అదే గుజరాత్ గెలిస్తే, రెండో స్థానంలో గుజరాత్ కొనసాగుతుంది. ఎలిమినేటర్ కు ఎంపిక అవుతుంది. ఇక యూపీతో మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే, ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక వేళ ఢిల్లీ గెలిచినా, ముంబై రన్ రేట్ ఎక్కువ ఉంటే కష్టమే. అప్పుడు యూపీతో పాటు ఢిల్లీ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి మూడవ తేదీన వడోదర వేదికగా నిర్వహిస్తారు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫిబ్రవరి 5వ తేదీన వడోదర వేదికగా ఫైనల్ ఆడుతుంది. మొత్తానికి ఎలిమినేటర్ స్టేజ్ వెళ్లేందుకు ఎక్కువ ఛాన్సులు ముంబై, గుజరాత్ జట్లలకు మాత్రమే ఉన్నాయి. అంటే ఢిల్లీ, యూపీ ఇంటిదారి పట్టే ఛాన్స్ ఎక్కువ.