E-Paper
Advertisement

T.G.Vishwa Prasad: అరుదైన గౌరవాన్ని అందుకున్న ది రాజా సాబ్ నిర్మాత!

T.G.Vishwa Prasad: అరుదైన గౌరవాన్ని అందుకున్న ది రాజా సాబ్ నిర్మాత!

T.G.Vishwa Prasad: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో బడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న వారిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం ఆధ్వర్యంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత టీజీ విశ్వప్రసాద్(T.G.VishwaPrasad) నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విశ్వప్రసాద్ కు అరుదైన పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ఈయన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు..

నిర్మాత  విశ్వప్రసాద్ కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్స లెన్స్ అవార్డు లభించింది. నేడు ఈయన పశ్చిమబెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద్ బోస్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు .ఇందుకు సంబంధించిన ఫోటోలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు కూడా నిర్మాత విశ్వప్రసాద్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతూ ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్నీ అందించినట్టు తెలుస్తుంది.

ది రాజా సాబ్..

ఇకపోతే ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా అందుకున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని ప్రకటించిన ఈ అవార్డులలో మోహన్ బాబుకు కూడా ఈ పురస్కారాన్ని అందచేయడంతో మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఈ గౌరవాన్ని పొందారు. ఇక విశ్వప్రసాద్ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఈయన తన నిర్మాణ సంస్థలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ జోడిగా మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సుమారు 450 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా కనీసం సగం వసూళ్లను కూడా రాబట్ట లేకపోవడంతో నిర్మాత విశ్వప్రసాద్ భారీగా నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.

Also Read: Chiranjeevi: కాజల్.. తమన్నా అంటే ఎవరు? షాకింగ్ కామెంట్స్ చేసిన చిరు!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×