E-Paper
Advertisement

T.G.Vishwa Prasad: అరుదైన గౌరవాన్ని అందుకున్న ది రాజా సాబ్ నిర్మాత!

T.G.Vishwa Prasad: అరుదైన గౌరవాన్ని అందుకున్న ది రాజా సాబ్ నిర్మాత!
Advertisement

T.G.Vishwa Prasad: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో బడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న వారిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం ఆధ్వర్యంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత టీజీ విశ్వప్రసాద్(T.G.VishwaPrasad) నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విశ్వప్రసాద్ కు అరుదైన పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ఈయన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు..

నిర్మాత  విశ్వప్రసాద్ కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్స లెన్స్ అవార్డు లభించింది. నేడు ఈయన పశ్చిమబెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద్ బోస్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు .ఇందుకు సంబంధించిన ఫోటోలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు కూడా నిర్మాత విశ్వప్రసాద్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతూ ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్నీ అందించినట్టు తెలుస్తుంది.

ది రాజా సాబ్..

Advertisement

ఇకపోతే ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా అందుకున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని ప్రకటించిన ఈ అవార్డులలో మోహన్ బాబుకు కూడా ఈ పురస్కారాన్ని అందచేయడంతో మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఈ గౌరవాన్ని పొందారు. ఇక విశ్వప్రసాద్ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఈయన తన నిర్మాణ సంస్థలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది.

Advertisement

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ జోడిగా మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సుమారు 450 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా కనీసం సగం వసూళ్లను కూడా రాబట్ట లేకపోవడంతో నిర్మాత విశ్వప్రసాద్ భారీగా నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.

Also Read: Chiranjeevi: కాజల్.. తమన్నా అంటే ఎవరు? షాకింగ్ కామెంట్స్ చేసిన చిరు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×