E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో విషాదం..! గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి..!

Hyderabad : హైదరాబాద్‌లో విషాదం..! గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి..!

Hyderabad : సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటం ఎగురవేస్తూ భవనం పైనుంచి కింద పడి ఓ బాలుడు మరణించిన ఘటన హైదరాబాద్ నాగోల్ లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్‌లో అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుమారుడు శివకుమార్ (13) నాగోల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

సంక్రాంతి సెలవులు రావడంతో తోటి స్నేహితులతో శనివారం సాయంత్రం ఇంటి పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఈ సమయంలో గాలి రాకపోవడంతో పక్క బిల్డింగు పైకి వెళ్లి తోటి స్నేహితులతో గాలిపటం ఎగురేస్తుండగా ఆ ఇంట్లోని కుక్క అతడిపైకి ఎగబడింది. దీంతో భయపడిన శివకుమార్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కు వెళ్లగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో శివ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. తోటి స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×