BigTV English
Advertisement

Mahbubnagar : న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Mahbubnagar :  న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Mahbubnagar : విద్యార్థులంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడు గ్రామనికి చెందిన హన్మంత్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు రాంరెడ్డి(17) మహబుబ్ నగర్ ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్టడీ అవర్ జరుగుతుండగా ఐదో అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లి పడుకున్నాడు.


తెల్లవారుజామున 3.31 గంటలకు రాంరెడ్డి పడుకున్న గది నుంచి రెండో అంతస్తులో ఉన్న గదికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టుకున్నాడు. గదిలోని సీసీ కెమెరా పైకి తిప్పాడు. తర్వాత గదిలో రాంరెడ్డి టవల్ తో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కళాశాల సిబ్బంది గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అని సీఐ తెలిపారు.

కాగా.. విద్యార్థి తల్లిదండ్రులు , బంధువులు తమకు న్యాయం చేయాలంటు కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థి తండ్రి.. తమ కుమారుడి మెడ వద్ద గాయాలు ఉన్నాయని.. ఈ విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరాడు. తమ కుమారుడి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాంరెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


Related News

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Big Stories

×