BigTV English
Advertisement

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: ఇటీవల ఓ మూడో తరగతి బాలుడు టీచర్ తనని కారణం లేకుండా కొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వింత ఘటనలు పోలీసులకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసులకు మాత్రం ఊహించిన అనుభవం ఎదురైంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అప్పటికే కాకతీయ ప్యాసింజర్ రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కాడు. హడావుడిగా రైలు ఎక్కడంతో అతని కాలుకున్న చెప్పు ఒకటి జారి ట్రాక్‌పై పడిపోయింది. ట్రైన్‌ ఆల్రడీ కదలడంతో దిగి తీసుకోలేని పరిస్థితి. ఇక చేసేది ఏమీ లేక అలానే హైదరాబాద్ వెళ్లాడు ఆ యువకుడు.

రూమ్‌కి వెళ్లాక అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ట్రైన్ ఎక్కుతుండగా తన చెప్పు జారిపడిపోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్ వద్ద గాలించి ఎట్టకేలకు చెప్పును కనుగొన్నారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకొని చెప్పును అప్పగించారు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×