Software Emp died in Gachibowli: హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. హాస్టల్ లోని నీటి సంపులో పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపుతోంది. హాస్టల్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఓ నింపు ప్రాణం బలైందని మృతుడి తల్లిదండ్రులు, హాస్టల్ లోని యువకులు ఆరోపిస్తున్నారు. 24 ఏళ్ల యువకుడు హటాత్తుగా చనిపోవడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు యువకుడి మృతికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన షణ్ముఖ(24) అనే యువకుడు హైదరాబాద్లోని రాయదుర్గంలో హాస్టల్ లో ఉండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆదివారం సెలవు కావడంతో హాస్టల్ లోనే ఉన్నాడు. అయితే హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి హాస్టల్ కు వస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే షణ్ముక హాస్టల్ లోకి వస్తూ ఒక్క సారిగా హాస్టల్ గేటు తెరిచాడు. అనంతరం గేటు మూసి లోపలికి వచ్చాడు. అయితే గేటుకు నాలుగు అడుగుల దూరంలోనే ఓ నీటి సంపు ఉంది. నీటి సంపు డోరు తీసి ఉండడంతో షణ్ముక దానిని గమనించకుండా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. దీంతో సంపులో పడిపోయాడు. ఈ తరుణంలో తన చేతిలో ఉన్న అరటిపండ్ల కవర్ పక్కన పడిపోయింది. అనంతరం సంపులో పడిన షణ్ముక తలకు గాయం అయింది.
Also Read:
షణ్ముక సంపులో పడడంతో ఒక్కసారిగా శబ్ధం వచ్చింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న పిల్లలు, హాస్టల్ నిర్వాహకుడు శబ్ధం విని పరుగులు తీస్తూ వచ్చారు. అప్పటికే షణ్ముక అందులో పడిపోవడం చూసి యజమాని వారించాడు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ ఘటన అంనతరం పోలీసులు హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ – గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు.
హాస్టల్ యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. pic.twitter.com/nFJHGyeMjc
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2024