E-Paper
Advertisement

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Advertisement

Sheep distribution scam Telangana(TS today news): గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్థక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు.

వీరిద్దరూ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 2 వారాల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read: ‘అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్‌కు అభ్యంతరం ఎందుకు..?’

కాగా, గొర్రెల పంపిణీ స్కామ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసినవారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ దూకుడు పెంచడంతో భవిష్యత్ లో ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×