E-Paper
Advertisement

Chocolates : పిల్లలు చాక్లెట్స్ అడగ్గానే కొనిచ్చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

Chocolates : పిల్లలు చాక్లెట్స్ అడగ్గానే కొనిచ్చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

Chocolates : పిల్లలన్నాక చిరుతిండి వైపే ఎక్కువ మొగ్గుచూపుతారు. వారు కోరిందివ్వకపోతే.. ఇల్లుపీకి పందిరేసేస్తారు. పిల్లల ఏడుపు చూడలేకనో, వారి గోల భరించలేకనో చేసేది లేక ఏది అడిగితే అది కొనిస్తుంటారు. అలా పిల్లలు మారాం చేసి మరీ కొనిపించుకునేవాటిలో చాక్లెట్స్ దే మొదటిస్థానం. ఇప్పుడు ఆ చాక్లెట్స్ తయారీకి సంబంధించిన ఓ వార్త అందరినీ కలవరపెడుతోంది.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో చిన్నారుల ప్రాణాలను లెక్క చేయకుండా.. అక్రమ సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కేటుగాళ్లు. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్‌ పేరుతో కల్తీ దందా సాగిస్తున్నారు. అనూష్‌ ఇమ్లీ, క్యాండీ జెల్లీ పేరుతో కల్తీ చాక్లెట్లు తయారీ చేసి విక్రయిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించుకుండా.. దుర్గంధం వెదజల్లే స్థలంలో ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, స్థానిక జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి అనుమతి లేకుండానే యథేచ్చగా దందాను సాగిస్తున్నారు. పసి పిల్లల ప్రాణాలకు మీదకు తెస్తున్న కల్తీ చాక్లెట్ల తయారీపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. హైదరాబాద్‌లోని అనుస్ ఇమ్లీ పరిశ్రమపై పోలీసులు రెయిడ్‌ చేశారు అని వచ్చిన వార్తల్లో నిజం లేదని సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. డ్రైనేజి సమస్య ఉన్న మాట వాస్తవమే కానీ, రసాయనాలు వాడి చాక్లెట్స్ తయారు చేయడం లేదని అంటున్నారు. అసలు పోలీసుల రైడ్సే జరగలేదని చెప్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×