Jemimah Rodrigues: మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ సెమీ ఫైనల్ దశలో అద్భుతంగా రాణించి లేడీ హీరో అయిపోయారు జెమిమా రోడ్రిగ్స్. సెమీఫైనల్ దశలో సెంచరీతో దుమ్ము లేపి, జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లారు. అయితే 125 పరుగులతో రెచ్చిపోయిన జెమిమా రోడ్రిగ్స్, టీమిండియా విజయం అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను జీసస్ నడిపించాడని, అతని వల్లే టీమిండియా గెలిచిందన్న రేంజ్ లో జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) స్పీచ్ ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు జెమిమా రోడ్రిగ్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. టీమిండియా నుంచి కూడా తొలగించాలని, ఫైనల్స్ లో ఆడించకూడదని డిమాండ్ చేశారు ఫ్యాన్స్.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ను జీసస్ గురించి ప్రస్తావించి జెమిమా రోడ్రిగ్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాను గెలిపించే అంత వరకు ఆమె లేడీ హీరోగా కనిపించి, ఎప్పుడైతే జీసస్ ( Jesus) ప్రస్తావని తెచ్చిందో అప్పటి నుంచి ఆమెను జీరో చేసేశారు అభిమానులు. కాస్త ఎమోషనల్ అయిన ఆమె జీసస్ గ్రేట్, ఆయన వల్లే టీమిండియా విజయం అన్న రేంజ్ లో స్పీచ్ ఇవ్వడం వివాదానికి తెరలేపింది. అయితే, ఈ వివాదానికి తాజాగా జెమిమా రోడ్రిగ్స్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
విజేతలుగా నిలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి టీమిండియా ( Team India) బృందం వెళ్ళింది. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా ప్లేయర్లందరికీ తిలకం పెట్టారు. టీమిండియాలో ఇలా తిలకం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి క్రైస్తవులు తిలకం పెట్టుకునేందుకు అస్సలు ఇష్ట పడరు. అసలు గుడిలో కూడా అడుగు పెట్టరు. అలాంటిది టార్చర్ భరించలేక, జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) తిలకం పెట్టుకుంది. స్మృతి మందాన పెట్టుకోకపోయినా…జెమిమా రోడ్రిగ్స్ మాత్రం తిలకం పెట్టుకొని, వివాదానికి చెక్ పెట్టింది. తనకు జీసస్ తో పాటు హిందూ దేవుళ్ళు కూడా సమానమయని మెసేజ్ ఇచ్చింది. దీంతో జెమిమా రోడ్రిగ్స్ ను ఇప్పుడు మెచ్చుకుంటున్నారు జనాలు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( Women’s ODI World Cup 2025 tournament ) దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా కు భారీ నజరానా వచ్చింది. ఐసీసీ నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు టీమిండియా కు దక్కింది. ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) నుంచి రూ.51 కోట్లు ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
Jemimah accepts Tilak!!
Smrithi mandhana refuses Tilak!!
Just imagine, if jemimah did the same, how sanghis, andhbhakths. Fake sananthanis would have trolled her.
Irrespective of their personal choices, both smrithi & jemimah are stars of India and India's Pride!! pic.twitter.com/NFspAItzGf— The Samosa Times (@Samotimes2026) November 8, 2025