Dude OTT: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ చిత్రం డ్యూడ్.. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీవిజయాన్ని సొంతం చేస్తుంది. పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్లు కూడా ఎక్కువగానే రాబట్టింది. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్.. ఈ మూవీలో ఈ హీరోకు జోడిగా మమిత బైజు నటించింది. థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ను ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..
ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.. రీసెంట్ గా దీవాలి సందర్భంగా రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రావడంతో యూత్ ఎక్కువగా సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.. ఇది కూడా 100 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకు హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. ఇక ఈ మూవీని ఈ నెల 14 న స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్లు ఆఫీషియల్ గా ప్రకటించేసారు.. ఆ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. మూవీ లవర్స్ ఆ మూవీని చూసేయ్యండి.
Also Read : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.. రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. బిజినెస్ కూడా ఈ మూవీకి బాగానే జరిగింది. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా దాదాపు 550 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తో సక్సెస్ టాక్ ని అందుకుంది. ఇకపోతే క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 100 కోట్లకు పైగా వసూల్ చేసింది. అయితే నష్టం అయితే రాలేదు కానీ.. సినిమా టార్గెట్ ను రీచ్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి స్టోరీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడో చూడాలి..