Raj Tarun : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రాజ్ తరుణ్.. ఈ యంగ్ హీరో డిఫరెంట్ స్టోరీ లతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోకు ఆ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాలని అందించలేదు.. దాంతో ఈ ఏడాది థియేటర్లలో తన సినిమాని రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చారు.. ఈయన నటించిన తాజా చిత్రం చిరంజీవ.. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.. శుక్రవారం రిలీజ్ అయిన ఏ మూవీ మంచి వ్యూస్ ను అందుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందులో నిజమేంత ఉందో అన్నది తెలుసుకుందాం..
తాజాగా రాజ్ తరుణ్ నటించిన చిత్రం చిరంజీవ.. జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక రాజ్ తరుణ్ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే మీరు అదిరే అభి కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అని యాంకర్ అడిగారు. ఆయన ఆల్రెడీ సినిమాలు కూడా చేశాడు ఆయనకి చాలా అనుభవం ఉంది అందుకే ఆయనతో సినిమా అనగానే ఓకే చెప్పేసాను అని అన్నారు. ఇక నెక్స్ట్ మీరు హీరోగా సినిమాలో చేస్తారా అని అడగ్గా.. నేను డైరెక్ట్ అవ్వాలని సినిమాల్లోకి వచ్చాను.. కానీ అనుకోకుండా హీరో అయ్యాను. నెక్స్ట్ నేను డైరెక్టర్గా ప్రయత్నాలు చేయబోతున్నాను అని ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు రాజ్ తరుణ్.. అంటే ఇకమీదట హీరోగా సినిమాలు చెయ్యడా..? డైరెక్టర్ గా మారితే ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే… ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్గా చేస్తారు లేదా హీరోగా చేస్తారు తెలిస్తే ఈ న్యూస్ పై క్లారిటీ వస్తుంది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : షీలా పుట్టినరోజు వేడుకకు బాలు దూరం.. ప్రభావతి హ్యాపీ.. బాధపడిన సత్యం..
ఒకప్పుడు షార్ట్ ఫిలిం లలో నటించి మంచి క్రేజ్ ను అందుకున్న రాజ్ తరుణ్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన నటించిన మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా. ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించాడు కానీ ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కోర్టు చుట్టు తిరిగిన విషయం తెలిసిందే.. తన మాజీ ప్రియురాలు లావణ్య తనపై చీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. దానివల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన హీరో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అతనిపై ఆరోపణలు ఉండడం వలన ఏమో తెలియదు కానీ ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన చిరంజీవ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది.